
సన్న బియ్యం నాణ్యతపై అనుమానాలు
ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద 1,430 స్కూళ్లలో 2,55,718 మందికి ఈ ఏడాది నుంచి సన్న బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. అయితే పూర్తి స్థాయిలో అన్ని స్కూళ్లకు చేరలేదని తెలుస్తోంది. అదేవిధంగా వంట ఏజెన్సీల నిర్వాహకులే ఈ బియ్యం నాణ్యత సక్రమంగా లేవని, రేషన్ బియ్యమే పాలిష్ చేసినట్లు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో చాలా చోట్ల కోడి గుడ్లు, చీక్కీలు అందుబాటులో లేని పరిస్థితి. దీంతో పాటు రాగా జావ ఎక్కడ కూడా పిల్లలకు అందించకపోవడం గమనార్హం.