
పింఛన్ తీసుకొస్తూ వృద్ధుడి మృతి
కోసిగి: పింఛన్ తీసుకుని వస్తూ నిద్రమత్తులో కల్వర్టు నుంచి కిందకు పడిపోయి వృద్ధుడు మృతి చెందాడు. మండల పరిధిలోని ఐరన్గల్– పెద్దభుంపల్లి గ్రామాల మధ్య ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు బుధవారపేటకు చెందిన జగ్గుల మద్దిలేటి(64) గతంలో కడపలో బీడీ కార్మికుడిగా పని చేసేవాడు. ప్రతి నెలా కడపకు వెళ్లి పింఛన్ కోసం తెచ్చుకునేవాడు. ఈ నెల 8న కడపకు వెళ్లి 9వ తేదీన రైలులో మంత్రాలయం రైల్వే స్టేషన్ వచ్చాడు. అక్కడ నుంచి ఎటు వెళ్లాలో తెలియక పట్టాల వెంబడి నడుచుకుంటూ మంగళవారం సాయంత్రం ఐరన్గల్ గ్రామ సమీపానికి వచ్చాడు. పొలాల్లోని కల్వర్టుపైన నిద్రించాడు. కల్వర్టు నుంచి కిందకు పడిపోయి మృతి చెందగా బుధవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు గుర్తించారు. సమాచారం తెలుసుకుని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుని ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చెరుకుని మృతిదేహాన్ని కర్నూలుకు తీసుకెళ్లారు.

పింఛన్ తీసుకొస్తూ వృద్ధుడి మృతి