
దిక్కులు చూస్తున్నాం
మాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. వర్షాధారం కింద పంటలు సాగు చేస్తున్నాం. ఖరీఫ్ ముంచుకొస్తోంది. పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్కు ముందే వైఎస్సార్ రైతుభరోసా, ఉచిత పంటల బీమా ఇచ్చేవారు. ఇది రైతులకు ఊరట నిచ్చేది. ఇపుడు రైతులకు చేయూత లేకపోవడంతో దిక్కులు చూస్తున్నాం.
– కే.గంగన్న, బస్తిపాడు, కల్లూరు మండలం
అప్పులు తెస్తున్నాం
కూటమి ప్రభుత్వంలో రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. 2024–25లో ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడిసాయానికి మంగళం పలికారు. ఈ సారి ముందస్తుగా వానలు పడుతున్నాయి. విత్తనాలు లేవు. ఆర్బీకేల్లో ఎరువులు కరువు. పెట్టుబడుల కోసం అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది.
– లింగన్న, మారెళ్ల, తుగ్గలి మండలం

దిక్కులు చూస్తున్నాం