మొక్క జొన్న పంట దగ్ధం | - | Sakshi
Sakshi News home page

మొక్క జొన్న పంట దగ్ధం

Apr 25 2025 8:28 AM | Updated on Apr 25 2025 8:28 AM

మొక్క జొన్న పంట దగ్ధం

మొక్క జొన్న పంట దగ్ధం

పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యంలోని డొంగు సమీపంలో చేతికొచ్చిన మొక్కజొన్న పంట అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. గ్రామంలోని రైతు వై.వి లింగమయ్యకు చెందిన 3 ఎకరాలు, లింగాల సుబ్రహ్మణ్యంకు చెందిన 3 ఎకరాలు, గుడిపాటి మద్దిలేటికి చెందిన 1.50 ఎకరాల పంట దగ్ధమైంది. పొలంలో మంటలు వ్యాపించడంతో గమనించిన రైతులు నంద్యాల అగ్నిమాపక స్టేషన్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. మరో రోజుల్లో మూడు రోజుల్లో పంట కోత చేపట్టాల్సిన సమయంలో ప్రమాదం జరగడంతో రైతులు నష్టపోయారు. బోర్‌ వైర్‌ నుంచి మంటలు చేలరేగి పంటలకు వ్యాపించినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఎకరానికి రూ. 35వేలకు వరకు పెట్టుబడులు పెట్టామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న తహసీల్దార్‌ నరేంద్రనాథ్‌రెడ్డి, ఆర్‌ఐ రాము, వ్యవసాయ అధికారులు దగ్ధమైన పంటను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement