శ్రీనగర్‌ ఎస్పీగా కర్నూలు వాసి | - | Sakshi
Sakshi News home page

శ్రీనగర్‌ ఎస్పీగా కర్నూలు వాసి

Apr 19 2025 9:32 AM | Updated on Apr 19 2025 9:32 AM

శ్రీనగర్‌ ఎస్పీగా కర్నూలు వాసి

శ్రీనగర్‌ ఎస్పీగా కర్నూలు వాసి

కర్నూలు: జమ్ముకాశ్మీర్‌లో జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో కర్నూలు వాసి డాక్టర్‌ సందీప్‌ చక్రవర్తి శ్రీనగర్‌ ఎస్పీగా నియమితులయ్యారు. ఈయన ఎంబీబీఎస్‌ పూర్తి చేసి 2013లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. విద్యాభ్యాసం మొత్తం కర్నూలులోనే జరిగింది. ఈయన తండ్రి డాక్టర్‌ రాంగోపాల్‌ రావు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఆర్‌ఎంఓగా పదవీ విరమణ పొంది ప్రస్తుతం కర్నూలు బీ–క్యాంప్‌లో నివాసముంటున్నారు. సందీప్‌ చక్రవర్తి పోలీసు శాఖలో చేరినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఏఎస్పీగా పూంచ్‌, యూరి, సోపోర్‌, బారాముల్లా, శ్రీనగర్‌ సౌత్‌ జోన్‌ ఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం జరిగిన బదిలీల్లో శ్రీనగర్‌ ఎస్‌ఎస్‌పీగా నియమితులయ్యారు. విధి నిర్వహణలో ఈయన ఆరు పీఎంజీ, నాలుగు సార్లు జేకే పీఎంజీ, ఐదు సీఆర్‌పీఎస్‌ డీజీపీ కమాండెంటేషన్‌, రెండుసార్లు ఇండియన్‌ ఆర్మీ డిస్క్‌, ఒక్కసారి జమ్మూకాశ్మీర్‌ డీజీపీ నుంచి కమాండెంటేషన్‌ డిస్క్‌, ఒకసారి ఐటీ బీపీఈడీటీ కమాండెంటేషన్‌ డిస్క్‌ పతకాలను పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement