రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు

Dec 12 2025 10:12 AM | Updated on Dec 12 2025 10:12 AM

రైతుల

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు కిడ్నీ బాధితుడు బాలాజీ మృతి డీఈవోగా చంద్రకళ బాధ్యతల స్వీకారం

జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఇలక్కియా

తిరువూరు: ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో సజావుగా సాగుతోందని ఎన్టీఆర్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఇలక్కియా తెలిపారు. విస్సన్నపేట, గంపలగూడెం, పెదకొమెర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను గురువారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. తిరువూరు రెవెన్యూ డివిజన్లో 53, నందిగామ డివిజన్లో 46, విజయవాడ డివిజన్లో 37 రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 23లక్షల 21వేల 400 గోనెసంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంతవరకు 70,156 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.146 కోట్ల నగదు జమ చేశామన్నారు. రైతులకు ధాన్యం విక్రయంలో ఇబ్బందులను ఇలక్కియా అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పరిష్కరించాలని స్థానిక అధికారుల్ని ఆదేశించారు. తిరువూరు రెవెన్యూ డివిజనల్‌ అధికారి మాధురి, రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు.

తిరువూరు: ఎ.కొండూరు మండలం మత్రియా తండాలో కిడ్నీవ్యాధికి గురై చికిత్స పొందుతున్న బర్మావత్‌ బాలాజీ (47) గురువారం మృతిచెందాడు. గత ఐదేళ్లుగా కిడ్నీ వ్యాధికి చికిత్స నిమిత్తం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా పరిస్థితి మెరుగుపడక బాలాజీ మృత్యువాత పడ్డాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలాజీకి ఇద్దరు సంతానం కాగా ఒక కుమారుడు పుట్టుకతోనే మానసిక వికలాంగుడు. మండలంలో గత రెండు నెలల్లోనే ఆరుగురు కిడ్నీరోగులు మృతిచెందడంతో గిరిజన తండా వాసులు ఆందోళన చెందుతున్నారు. బాలాజీ కుటుంబాన్ని సీపీఎం మండల కార్యదర్శి పి.ఆనందరావు, సీఐటీయూ మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు అమ్మిరెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు కుమార్‌ నాయక్‌ పరామర్శించారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎల్‌.చంద్రకళ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేసిన ఆమె తాజా బదిలీలలో ఎన్టీఆర్‌ జిల్లాకు వచ్చారు. గురువారం ఉదయం కార్యాలయానికి వచ్చిన ఆమెకు సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఆమె ఉద్యోగులతో మాట్లాడారు. జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలు, విద్యార్థులకు చేర్చటం, పర్యవేక్షణ బలోపేతం చేస్తానన్నారు. పారదర్శక సేవలను అందిస్తామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, ప్రధానోపాధ్యాయులు బోధనా సిబ్బంది సమష్టిగా పనిచేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సహకరించాలని సూచించారు.

యూటీఎఫ్‌ నాయకుల శుభాకాంక్షలు

జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రకళకు యూటీఎఫ్‌ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఆమెను కలిసిన వారిలో రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌కుమార్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య నాయకులు పి.లీల, జె.రామకృష్ణ, ఎం.లలిత, ఎ.భరత్‌, ఎస్పీహెచ్‌ఆర్‌ దేవ్‌ తదితరులు ఉన్నారు.

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు 1
1/2

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు 2
2/2

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement