18 నుంచి రాష్ట్ర యువజనోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

18 నుంచి రాష్ట్ర యువజనోత్సవాలు

Dec 5 2025 6:58 AM | Updated on Dec 5 2025 6:58 AM

18 నుంచి రాష్ట్ర యువజనోత్సవాలు

18 నుంచి రాష్ట్ర యువజనోత్సవాలు

● యువతలో నైపుణ్యాలు వెలికితీయడమే ప్రధాన లక్ష్యం ● యువజన సేవల శాఖ కమిషనర్‌ భరణి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడమే లక్ష్యంగా యువజన మహోత్సవం యువ –2025 నిర్వహిస్తున్నట్లు యువజన సేవల శాఖ కమిషనర్‌ ఎస్‌.భరణి తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలోని శాప్‌ ప్రధాన కార్యాలయంలో గురువారం రాష్ట్ర యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర యువజన మహోత్సవం యువ– 2025 నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ ఈ నెల 18, 19, 20 తేదీలలో వడ్డేశ్వరం కేఎల్‌ యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి యువజన మహోత్సవాలను ‘యూత్‌ ఫర్‌ స్వర్ణాంధ్ర‘ థీమ్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ థీమ్‌ ముఖ్యంగా యువత ఆలోచనలు, ప్రతిభ, సృజనాత్మకత రాష్ట్ర అభివృద్ధికి ఎంత ముఖ్యమో తెలియజేస్తుందన్నారు. ప్రతి యేటా జిల్లా, రాష్ట్ర యువజన ఉత్సవాలను నిర్వహించి తద్వారా రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి సాధించిన విజేతలను ఢిల్లీలో నిర్వహించే జాతీయ యువజన ఉత్సవాలకు పంపుతామన్నారు. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు గల యువతకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన ప్రథమ బహుమతి విజేతలు రాష్ట్ర స్థాయిలో జరిగే ఈవెంట్లలో పాల్గొంటారన్నారు. అన్ని జిల్లాల నుంచి దాదాపు 700 మంది యువత పోటీల్లో పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు. జానపద నృత్య బృందం, జానపద పాటల బృందం, పెయింటింగ్‌, ప్రకటన, కవితా రచన, కథా రచన, ఆవిష్కరణ (సైన్స్‌ మేళా ప్రదర్శన) ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తారన్నారు.ఈ ఉత్సవాల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు సర్టిఫికెట్‌, జ్ఞాపిక అందజేస్తామన్నారు. అనంతరం యువజన మహోత్సవం యువ –2025 ఈవెంట్‌ కర్టెన్‌ రైజర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ఏపీ యూత్‌ సర్వీసెస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ లక్ష్మణ్‌, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల సీఈవో యు.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement