
రేపు పామర్రులో జాబ్మేళా
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన పామర్రులో జాబ్మేళా నిర్వహిస్తున్నామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం జాబ్మేళాకు సంబంధించిన పోస్టర్లను అధికారులతో కలిసి విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ 18వ తేదీ పామర్రులోని ఆరేపల్లి కల్యాణ మండపంలో ఈ జాబ్మేళా ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. హెటిరో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్, సుధీర్ టింబర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బజాబ్ ఫిన్సర్వ్ లిమిటెడ్, టాటా క్యాపిటల్, వరుణ్ మోటార్స్, అపోలో ఫార్మసీ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ఈ కంపెనీల్లో ఉద్యోగాల కోసం పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు గల యువతీ, యువకులు అర్హులన్నారు. ఎంపికై న వారికి మంచి వేతనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. డీఆర్వో చంద్రశేఖరరావు, మెప్మా పీడీ సాయిబాబు, సమగ్ర శిక్ష ఏపీసీ కుముదినీసింగ్, ఆర్డీవో కె. స్వాతి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి. నరేష్కుమార్, ఉపాధి కల్పనశాఖాధికారి డి. విక్టర్బాబు పాల్గొన్నారు.