
పేదల ఇళ్లపై కూటమి గద్దలు..
బందరులోని 41వ డివిజన్ కుమ్మరిగూడెం ప్రాంతంలోని పేద ప్రజలకు గత పాలకులు దాదాపు 200 స్థలాలు ఇచ్చారు. విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు. పేదలు అప్పులు చేసి మరీ రేకుల షెడ్లను నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. ఇండోర్ స్టేడియం నిర్మించేందుకు ఈ స్థలం అవసరమని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలతో కార్పొరేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు పేదలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే భారీ పోలీసు బందోబస్తు నడుమ ఈ గృహాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేశారు. అదే డివిజన్లోని రాజీవ్నగర్లో ఓ ప్రైవేటు స్థలంలో రేకులషెడ్లు, పూరిళ్లు నిర్మించుకుని 30 ఏళ్లకు పైబడి ఉంటున్న పేదల గృహాలను కమిషనర్ బాపిరాజు కూల్చేప్రయత్నం చేశారు. రెండు ఇళ్లను పూర్తిగా కూల్చేశారు.