ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వైజ్ఞానిక విహారయాత్ర | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వైజ్ఞానిక విహారయాత్ర

Apr 25 2025 1:15 AM | Updated on Apr 25 2025 1:15 AM

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వైజ్ఞానిక విహారయాత్ర

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వైజ్ఞానిక విహారయాత్ర

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్‌ జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వైజ్ఞానిక విహార యాత్ర కోసం బయలుదేరి వెళ్లారు. ఏపీ ప్రభుత్వం, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విహార యాత్రను చేపట్టారు. జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ వైజ్ఞానిక ప్రదర్శ నల్లో ప్రతిభ చూపిన 101 మంది విద్యార్థులు, 10 మంది గైడ్‌ టీచర్లతో కలిసి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి బుధవారం రాత్రి వారు తరలివెళ్లారు. గురువారం చైన్నెలోని పెరియార్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌, బీఎం బిర్లా ప్లానిటోరియం, ఎవల్యూషన్‌ పార్క్‌లు, స్నేక్‌ పార్క్‌, మెరీనా బీచ్‌లను సందర్శించారు. విద్యార్థులు ఈ వైజ్ఞానిక విహార యాత్ర ద్వారా అంతరిక్ష పరిశోధన, విశ్వ ఆవిర్భావం, జీవపరిణామ క్రమం, న్యూక్లియర్‌ పవర్‌, పర్యావరణ పరిరక్షణ మొదలైన విషయాలను ప్రత్యక్ష పరిశీ లన ద్వారా తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మైనం హుస్సేన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement