
కేఈబీ కాలువలో విద్యార్థి గల్లంతు
ఘంటసాల: తల్లితో కలసి కాలువ దగ్గరకు వెళ్లి ఈత కొడుతూ విద్యార్థి గల్లంతైన ఘటన ఘంటసాల మండలం పాపవినాశనంలో గురువారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పాపవినాశనం గ్రామానికి చెందిన పత్తిపాటి వెన్నెల, ఏడుకొండలు దంపతులు. వారికి కుమారుడు పవన్ (15), కుమార్తె ఉన్నారు. 11 సంవత్సరాల క్రితం ఏడుకొండలు కేఈబీ కెనాల్లో గల్లంతై మృతి చెందాడు. అప్పటి నుంచి వెన్నెల తన రక్కల కష్టంతో పిల్లలను సాకుతోంది. పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పవన్ కొద్ది రోజులుగా తల్లితో పాటు వ్యవసాయ కూలి పనులకు వెళ్తున్నాడు. గురు వారం ఉదయం తల్లీకుమారులు మొక్కజొన్న కండెలు విరిచేందుకు వెళ్లారు. ఇంటికి వచ్చాక దుస్తులు ఉతికేందుకు వెన్నెల కేఈబీ కాలువ వద్దకు వెళ్లింది. ఆమెతోపాటు పవన్ కాలువ వద్దకు వెళ్లాడు. సరదా ఈత కొట్టేందుకు కాలువలోకి దిగాడు. కాలువలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో పవన్ గల్లంతయ్యాడు. వెన్నెల ద్వారా సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇరిగే షన్ అధికారులకు సమాచారం ఇచ్చి నిమ్మగడ్డ లాకు వద్ద గేట్లు వేసి నీరు ఆపాలని కోరారు. అయితే చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. తన కళ్ల ఎదుటే కుమారుడు గల్లంతవడంతో వెన్నెల కన్నీరుమున్నీరుగా విలపించింది.