
విద్యార్థులకు బంగారు పతకాలు
జూలై 7న స్నాతకోత్సవంలో అందజేత
కొణిజర్ల: కాకతీయ యూనివర్సిటీ ఇటీవల ప్రకటించిన బీఫార్మసీ, ఎం ఫార్మసీ కోర్సు ఫలితాల్లో కొణిజర్ల మండలం అమ్మపాలెం పంచాయతీ పరిధిలోని బ్రౌన్స్ ఫార్మసీ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి బంగారు పతకాలు సాధించారు. యం ఫార్మసీ కోర్సులో వేముల సింధు (2018), 2019 సంవత్సరానికి గాను బీఫార్మసీలో సముద్రాల రచన 4 బంగారు పతకాలు సాధించింది. 2021 సంవత్సరానికి గాను బీఫార్మసీలో మద్దోజు తేజశ్విని, కాటేపల్లి శివానీలు బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ పారుపల్లి ఉషాకిరణ్కుమార్, సెక్రటరీ కరస్పాడెంట్ పారుపల్లి విజయలక్ష్మి బంగారుపతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. జూలై 7న కాకతీయ స్నాతకోత్సవంలో విద్యార్థులకు బంగారు పతకాలు అందించనున్నట్లు తెలిపారు. ప్రిన్సిపల్ డాక్టర్ జగన్నాథ్ పాత్రో, ఏఓ సీహెచ్ హనుమంతరావు, అధ్యాపక బృందం అభినందించారు.

విద్యార్థులకు బంగారు పతకాలు

విద్యార్థులకు బంగారు పతకాలు

విద్యార్థులకు బంగారు పతకాలు