
మెకానిక్ తనయుడు న్యాయమూర్తి
ఖమ్మంమామిళ్లగూడెం: ఖమ్మం బొమ్మన సెంటర్లో టీవీ మెకానిక్గా పనిచేస్తున్న షేక్ చాంద్పాషా వచ్చే అరకొర సంపాదనతోనే కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను ఉన్నతస్థాయికి చేర్చాడు. పెద్ద కుమారుడు ఆరిఫ్ డిగ్రీ అనంతరం టైప్ నేర్చుకుని కోర్టులో ఉద్యోగం సాధించాడు. అంతటితో ఆగకుండా లా పూర్తి చేసి జడ్జిగా ఎంపికయ్యాడు. తొలుత కాజీపేట రైల్వే కోర్టులో జడ్జిగా పనిచేశాక, ప్రస్తుతం నకిరేకల్ కోర్టులో జూనియర్ సివిల్జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇక చాంద్ రెండో కుమారుడు ఆసిఫ్ హైదరాబాద్లో చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఈ విషయమై చాంద్ మాట్లాడుతూ ‘నాకొచ్చేది చాలీచాలని ఆదాయమే అయినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా చదువుపై దృష్టి సారించాలని బిడ్డలకు సూచించా. అలా వారు శ్రద్ధగా చదివి ప్రయోజకులు అయ్యారు. ఇంతకంటే ఆనందం ఏముంటుంది’ అని వెల్లడించాడు.