
ఆలయంలోకి దళితులకు ప్రవేశం లేదా?
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ అంటరానితనం కనిపిస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆలయంలోకి దళితుల ప్రవేశం నిషిద్ధమా? అనే మీమాంస రాయచూరు తాలూకా ఆత్కూరులోని అంబా భవాని ఆలయం వద్ద చోటు చేసుకుంది. దేవీ శరన్నవ రాత్రుల సందర్భంగా ఓ సమాజ యువకులు అమ్మవారి ఆలయంలో దర్శనానికి, మాల వేసుకోవడానికి వెళ్లగా ఆలయ పూజారి వారిని బయటే నిలిపి వారికి కండువా ఇచ్చి, కుంకుమ దిద్దడంపై ఆగ్రహం వ్యక్తమైంది. ఈ విషయంపై వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణకు నడుం బిగించారు. ఇరు వర్గాల మధ్య రాజీ ప్రక్రియ కోసం పోలీసులు శాంతి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఆలయంలోకి దళితులకు ప్రవేశం లేదా?