
పారిశ్రామికీకరణతో హైరానా
రాయచూరు రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో భారీ పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టింది. ఈనేపథ్యంలో ఒక వైపు పరిశ్రమల స్థాపనకు వ్యతిరేకం అవుతున్న తరుణంలో ప్రజలు వివిధ రకాలైన వింత రోగాల బారిన పడే అవకాశముందని సీనియర్ వైద్యులు అంటున్నారు. అణు విద్యుత్ స్థావరాల ఏర్పాటు, 50 కంపెనీల ఏర్పాటుతో ప్రజలు గుండెపోటు, సిలికోసిన్ వ్యాధులతో బాధపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. యువత సిలికోసిన్ వ్యాధులతో మరణిస్తున్న విషయం బహిరంగమైంది. కొప్పళలో 47, బళ్లారిలో 68, కలబుర్గిలో 50 పరిశ్రమలు, రాయచూరులో ఉష్ణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో దాదాపు 3360 మెగావ్యాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లున్నాయి. రాయచూరు, యాదగిరి, బళ్లారి, కొప్పళ, విజయనగర జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలైన మౌలిక సౌకర్యాలు, వనరులు సమృద్ధిగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
నిరుద్యోగులకు మెండుగా ఉపాధి
పరిశ్రమల జోన్గా ప్రకటించడంతో భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. రాయచూరు జిల్లాలో 1744.75, యాదగిరి జిల్లాలో 3284.27 ఎకరాల భూమి, కొప్పళ జిల్లాలో 1600 ఎకరాలు, విజయనగర జిల్లాలో 1000 ఎకరాల భూములున్నాయి. పరిశ్రమల కేంద్రంలో రహదారి, మురుగు కాలువలు, తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పిస్తారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో కంపెనీలు ముందుకు వచ్చాయి. బెంగళూరు– ముంబై, చైన్నె–ముంబై, బెంగళూరు–న్యూఢిల్లీ, కన్యాకుమారి–చైన్నె, మైసూరు–వారణాసి రైళ్ల సౌకర్యం, విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్లు, తుంగభద్ర, కృష్ణా నదులు, హట్టి బంగారు గనుల కంపెనీలు, పత్తి, వరి, మిరప ప్రధాన పంటలు పండిప్తారు. దక్షిణ, ఉత్తర కర్ణాటక ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఇలాంటి పరిశ్రమల ఏర్పాటు విషయంలో ససేమిరా అనడంతో కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తోంది.
కళ్యాణ కర్ణాటకలో కర్మాగారాల
స్థాపనకు సర్కారు శ్రీకారం
కొప్పళలో 47, బళ్లారిలో 68,
కలబుర్గిలో 50 భారీ పరిశ్రమలు
గుండెపోటు, సిలికోసిన్ వ్యాధులతో
ప్రజలకు తప్పని పాట్లు
పరిశ్రమల ఏర్పాటుతో ప్రాణహాని
కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు సర్కార్ శ్రీకారం చుట్టడాన్ని హైదరాబాద్ కర్ణాటక జనాందోళన సమితి అధ్యక్షుడు రాఘవేంద్ర కుష్టిగి ఖండించారు. భారీ పరిశ్రమల ఏర్పాటు వల్ల ప్రాణహాని సంభవించే అవకాశాలున్నాయి.
– రాఘవేంద్ర కుష్టిగి, ఆందోళన కారుడు
భవిష్యత్తులో నీటి ఎద్దడి తప్పదు:
కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో పరిశ్రమల స్థాపన జరిగితే భవిష్యత్తులో తాగు, సాగునీటి ఎద్దడి తప్పదని రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ ఆరోపించారు. పరిశ్రమలు నడవడానికి నీరు ప్రధానమని, కంపెనీలు అధిక మొత్తంలో ఆ నీటి వినియోగంతో తుంగభద్ర ఎడమ కాలువ, కుడి కాలువ, విజయనగర కాలువల చివరి భూములకు నీరందవన్నారు.
– చామరస మాలిపాటిల్,
రైతు సంఘం అధ్యక్షుడు

పారిశ్రామికీకరణతో హైరానా

పారిశ్రామికీకరణతో హైరానా