
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలో మూడు ద్విచక్రవాహనాలు, మడేలేశ్వరస్వామి ఆలయంలో చోరీకి పాల్పడ్డ దొంగను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. వివరాలు.. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన వడ్లూరి నాగరాజు ఇటీవల జగిత్యాల జిల్లా కేంద్రంలోని చిన్న కెనాల్ వద్ద ఒక మోటార్సైకిల్, కొత్తబస్టాండ్లో ఒకటి, నిజామాబాద్ రోడ్లోని రాయల్ ఫంక్షన్హాల్ వద్ద మరో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడు. అలాగే జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి ప్రాంతంలోని మడేలేశ్వరస్వామి ఆలయంలో వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. ఈక్రమంలో పోలీసులు శనివారం మధ్యాహ్నం చిన్నకెనాల్వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ద్విచక్ర వాహనాలతో పాటు, 10 గ్రాముల వెండి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పట్టణసీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై మన్మదరావు, కానిస్టేబుళ్లు జీవన్, రాజిరెడ్డి పాల్గొన్నారు.