
జిల్లా జడ్జికి ప్రాసిక్యూటర్ల శుభాకాంక్షలు
కరీంనగర్క్రైం: కరీంనగర్ జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన ఎస్.శివకుమార్ను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.శరత్ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందించారు. జిల్లా జడ్జి ప్రాసిక్యూటర్లకు సంబంధించిన సమస్యలు, వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల పెండెన్సి తగ్గించేందుకు ప్రాసిక్యూటర్లు ముందుండాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రాసిక్యూటర్లు వారి సమస్యలను జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లక్ష్మిప్రసాద్, జూలూరి శ్రీరాములు, కుమారస్వామి, గౌరు రాజిరెడ్డి, గడ్డం లక్ష్మణ్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రంజిత్, వీరస్వామి పాల్గొన్నారు.
నీట్ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించండి
కరీంనగర్ అర్బన్/కరీంనగర్: వైద్య కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం మే 4న జరిగే నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణపై సమావేశం నిర్వహించారు. మే 4న జరిగే నీట్ ప్రవేశ పరీక్ష రాసే 2,975 మంది విద్యార్థుల కోసం ఏడు పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షకు ఒక రోజు ముందే కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఎక్కడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కాకుండా జాగ్రత్తలు వహించాలని, సీసీ టీవీ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి పరీక్షను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో నీట్ పరీక్ష జిల్లా కోఆర్డినేటర్ పంకజ్ కుమార్, జిల్లా మైనారిటీ అభివృద్ధి అధికారి పవన్కుమార్, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఎన్పీడీసీఎల్ ఏడీఈ లావణ్య, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఏసీపీ మాధవి, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
నేడు ఇస్కాన్ టెంపుల్ ప్రథమ వార్షికోత్సవం
కరీంనగర్ కల్చరల్: ఇస్కాన్ ఆధ్వర్యంలో ఉజ్వలపార్క్ సమీపంలో ఇస్కాన్ టెంపుల్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం సాయంత్రం 5:30 గంటల నుంచి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మందిర బాధ్యుడు నరహరి ప్రభుదాస్ తెలిపారు. మంగళవారం ఆలయంలో మాట్లాడుతూ.. సాయంత్రం అభిషేకం, మహానివేదన, హారతిసేవ ఉంటాయని, 6:30 గంటల నుంచి 8గంటల వరకు అలకాపురి కాలనీలో రాధాగోవిందుల పల్లకీసేవ, ప్రవచనం, కీర్తన, భజన ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు వార్షి కోత్సవంలో పాల్గొని జగన్నాథుని కృపకు కావాలని పిలుపునిచ్చారు. కన్నకృష్ణ, డాక్టర్ ఎల్.రాజభాసర్రెడ్డి, తుమ్మల రమేశ్రెడ్డి, సత్యనారాయణం, నగేశ్రెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రెండు, నాలుగో సెమిస్టర్ల ఫీజు గడువు
కరీంనగర్సిటీ: శాతవాహన విశ్వ విద్యాలయ పరీక్షల నియంత్రణ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (హానర్స్) కోర్సులో రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షల రుసుము నిర్ధారించడం జరిగిందని పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్కుమార్ తెలిపారు. అభ్యర్థులు వారివారి కళాశాలల్లో ఫీజు చెల్లించాలన్నారు. పరీక్షలు మే నెలలో జరుగుతాయని తెలిపారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా మే 6వ తేదీ వరకు, రూ.300 అపరాధ రుసుముతో మే9వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని సూచించారు.

జిల్లా జడ్జికి ప్రాసిక్యూటర్ల శుభాకాంక్షలు

జిల్లా జడ్జికి ప్రాసిక్యూటర్ల శుభాకాంక్షలు