కుటుంబ కలహాలతో.. యువకుడి తీవ్ర నిర్ణయం..! | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో.. యువకుడి తీవ్ర నిర్ణయం..!

Jun 26 2024 1:52 AM | Updated on Jun 26 2024 9:01 AM

-

కరీంనగర్: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. రాయికల్‌ పట్టణానికి చెందిన షేక్‌ ఫిర్దోజ్‌(27), కథలాపూర్‌ మండల కేంద్రానికి చెందిన ఫిర్దాజ్‌కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల పాప ఉంది. షేక్‌ ఫిర్దోజ్‌ కథలాపూర్‌లోని అత్తగారింట్లో ఉంటూ బైక్‌ మెకానిక్‌ షాపు నిర్వహిస్తున్నాడు.

15 రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో అతను రాయికల్‌ వెళ్లిపోయాడు. భార్యను కూడా రావాలని కోరగా.. ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో ఫిర్దాజ్‌ ఇటీవల పోలీస్‌స్టేషన్‌లో తన భర్తపై ఫిర్యాదు చేసింది. ఇరుకుటుంబాల మధ్య వివాదం సద్దుమణగలేదు. సోమవారం కథలాపూర్‌లో ఫిర్దోజ్‌తో అతని భార్యతోపాటు మామ షేక్‌ అమీర్‌ గొడవ పడ్డారు. తర్వాత ఫిర్దోజ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

మంగళవారం కథలాపూర్‌ మండలం సిరికొండ శివారులోని మామిడితోట వద్ద చెట్టుకు ఉరేసుకొని కనిపించినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని కోరుట్ల సీఐ సురేశ్‌బాబు పరిశీలించి, వివరాలు సేకరించారు. తన కుమారుడి ఆత్మహత్యకు భార్య ఫిర్దాజ్‌, మామ అమీర్‌లే కారణమని మృతుడి తండ్రి షేక్‌ బాషుమీయా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్‌ ఎస్సై నవీన్‌కుమార్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement