స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి

Jul 17 2025 3:28 AM | Updated on Jul 17 2025 3:28 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి

భూపాలపల్లి రూరల్‌: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం రాత్రి భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు. ప్రతి నాయకుడు, అంకిత భావంతో పనిచేయాలన్నారు. ప్రజల అభిమానం చూరగొన్న నాయకులకే ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. అదేవిధంగా, ఈ నెల 18న ఉదయం 10 గంటలకు చిట్యాల మండల కేంద్రంలో జరిగే మహిళా శక్తి సంబురాలకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క రానున్నట్లు తెలిపారు. ఈ సంబురాల్లో అన్ని గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొనేలా చూడాలని నేతలకు ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో అర్బన్‌ అధ్యక్షుడు దేవన్‌, భూపాలపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రాంచంద్రయ్య, జిల్లా నాయకులు రాంనర్సింహారెడ్డి(ఆర్‌ఎన్‌ఆర్‌) తదితర నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement