అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

Jun 22 2025 3:48 AM | Updated on Jun 22 2025 3:48 AM

అధిక

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

జిల్లా వ్యవసాయ అధికారి వీరునాయక్‌

రేగొండ: విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి వీరునాయక్‌ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని పలు ఎరువులు, విత్తన దుకాణాలను ఏఓ వాసుదేవారెడ్డితో కలిసి తనిఖీచేసి ఇన్వాయిస్‌, స్టాక్‌ రిజిస్టర్‌, బిల్లు బుక్కులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తన డీలర్లు విధిగా స్టాక్‌ వివరాలు, ధరల పట్టిక రోజు వారీగా నమోదు చేయాలన్నారు. అధిక ధరలకు విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్టు కింద కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తనాలను లైసెన్స్‌ కలిగిన డీలర్ల నుంచి కొనుగోలు చేసి, రశీదు పొంది ఆ రశీదును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు. బిజీ 3, లూజు పత్తి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దని, ఎవరైనా అమ్మితే సమాచారం అందించాలని కోరారు.

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు 
1
1/1

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement