యోగాతో ఆరోగ్యకర జీవనం | - | Sakshi
Sakshi News home page

యోగాతో ఆరోగ్యకర జీవనం

Jun 22 2025 3:48 AM | Updated on Jun 22 2025 3:48 AM

యోగాతో ఆరోగ్యకర జీవనం

యోగాతో ఆరోగ్యకర జీవనం

భూపాలపల్లి: ఆరోగ్యకర జీవనానికి యోగా ఎంతో ఉపయోగకరమని, నిత్య జీవితంలో ప్రతీ ఒక్కరు యోగా సాధన చేయాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్య, ఆయూష్‌ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా వేడుకలకు కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ‘యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌ ... వన్‌ హెల్త్‌’ థీమ్‌ చేపట్టినట్లు తెలిపారు. శరీరాన్ని శుద్ధిచేసి, మంచిని ఆచరిస్తూ, మంచి ఆలోచనలతో అమూల్యమైన ఫలితాలను సాధించేందుకు దివ్యమైన ఆయుధంగా యోగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ మధుసూదన్‌, ఆయూష్‌ వైద్యురాలు డాక్టర్‌ తనూజారాణి, డీపీఓ వీరభద్రయ్య, డీఎస్పీ సంపత్‌రావు, ఈడీఎం శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

అత్యవసర వైద్యసేవలు అందించాలి..

అత్యవసర వైద్యసేవలకు వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో వైద్య, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, డీఆర్‌డీఓ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణ, వ్యాధులు ప్రబలితే అత్యవసర వైద్యసేవలు అందించుట, డ్రై డే అమలు, వ్యక్తిగత పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మధుసూదన్‌, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ నవీన్‌కుమార్‌, డీపీఓ వీరభద్రయ్య, డీఆర్‌డీఓ బాలక్రిష్ణ పాల్గొన్నారు.

సాగుపై అవగాహన కల్పించాలి..

వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సూచించారు. సాగు పెట్టుబడికి ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా నిధులు జమపై శనివారం వ్యవసాయ అధికారి వీరునాయక్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లాలోని 12 మండలాల పరిధిలోని 1,12,740 మంది రైతులకు రూ.127.18 కోట్లు రైతు భరోసా నిధులు నేరుగా రైతుల బ్యాంక్‌ ఖాతాలకు జమ అయినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఏఓ వీరునాయక్‌, ఉద్యానవన శాఖాధికారి సునీల్‌కుమార్‌ పాల్గొన్నారు.

వన మహోత్సవానికి ప్రణాళికలు..

వన మహోత్సవం కార్యక్రమానికి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో వన మహోత్సవ ఏర్పాట్ల్లపై అటవీ, డీఆర్‌డీఓ, వ్యవసాయ, ఉద్యానవన, మున్సిపల్‌, పోలీస్‌, కేటీపీపీ, సింగరేణి తదితర శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. 28.77 లక్షల మొక్కలు నాటేందుకు శాఖలు, పరిశ్రమలకు లక్ష్యాన్ని కేటాయించామని అన్నారు. ఈ సమావేశంలో డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, డీఆర్‌డీఓ బాలక్రిష్ణ, డీఏఓ వీరునాయక్‌, ఉద్యానవన శాఖాధికారి సునీల్‌కుమార్‌, డీఎస్పీ సంపత్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వైద్యులు అందుబాటులో ఉండాలి

కలెక్టర్‌ రాహుల్‌శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement