
వెలివేసినా.. విజయబావుటా!
రఘునాథపల్లి: రఘునాథపల్లి గ్రామానికి చెందిన కొయ్యడ ప్రభాకర్ 33 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఇరు కుటుంబాలు వెలివేశాయి. అయినా బెదరకుండా అద్దె ఇంట్లో ఉంటూ.. ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా, ఆర్ఎంపీగా, రోజు వారీ కూలీగా పని చేశాడు. ముగ్గురు కుమారులు, ఒక కూతురిని చదివించారు. పెద్ద కుమారుడు ఉదయ్కుమార్ సింగరేణిలో పర్సనల్ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ ఇటీవల గ్రూప్–1లోనూ ప్రతిభ చాటారు. రెండో కుమారుడు పృధ్వీకుమార్ హైదరాబాద్లో లా పైనల్ ఇయర్ చదువుతున్నాడు. మూడో కుమారుడు ప్రణయ్కుమార్ తెలంగాణ కేడర్ ఐఏఎస్గా విధులు నిర్వహిస్తున్నారు. చిన్న కూతురు మౌనశ్రీ ఓయూలో పీహెచ్డీ చేస్తోంది. ‘ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొన్న.. అద్దె ఇంట్లో ఉంటూ పడరాని కష్టాలు పడ్డా. గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివించి ఉన్నత స్థానాల్లో నిలిపినందుకు గర్వపడుతున్నా. ప్రణయ్కుమార్ ఐఏఎస్ సాధించిన రోజు మరువలేనిది. అనేక కష్టాలను అనుభవించిన మేం.. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందు వరుసలో ఉంటాం’ అంటున్నారు ప్రభాకర్.