రాజీపడితేనే సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రాజీపడితేనే సమస్యల పరిష్కారం

Jun 15 2025 8:13 AM | Updated on Jun 15 2025 8:13 AM

రాజీపడితేనే సమస్యల పరిష్కారం

రాజీపడితేనే సమస్యల పరిష్కారం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ

జనగామ రూరల్‌: రాజీపడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ అన్నారు. జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని ఎక్కువ మొత్తంలో కేసులు పరిష్కారించుకోవాలన్నారు. లోక్‌ అదాలత్‌లో 6 బెంచ్‌ల ద్వారా సమస్యలను పరిష్కరించారు. మొత్తం సివిల్‌ కేసులు 82, మోటార్‌ యాక్సిడెంట్‌ కేసులు 4, క్రిమినల్‌ కేసులు 5160, ప్రీ లిటిగేషన్‌ 450 కేసులను పరిష్కరించగా రూ.1,03,17,307 వసూలు అయినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెంచ్‌ జడ్జీలు విక్రమ్‌, ఈ సుచరిత, జి. శశి, సందీప, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement