
నేడు మృగశిర కార్తె
● జోరుగా చేపల అమ్మకాలు
జనగామ: రోహిణి ముగిసి ఆదివారం(నేడు) మృగశిర కార్తె ఆరంభం కాబోతోంది. అయినా ఎండలు మండిపోతున్నాయి. పది రోజుల ముందు ముసు రు వర్షాలతో వాతావరణం కాసింత చల్లబడినా తిరిగి ఒక్క సారిగా వేడెక్కింది. మృగశిర ప్రారంభం రోజు చేపలు తినడం వల్ల వానాకాలంలో వచ్చే వ్యాధులు దూరమవడమే కాకుండా గుండె జబ్బులు, అస్తమా వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని ప్రజల నమ్మకం. ఎండాకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. వేడి ఉండేందుకు చేపలను తినడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా కొర్రమీను, రోహు, కట్ల, రవ్వు చేపలంటే చాలా మంది ఇష్టపడతారు. కొందరు ఏపీ నుంచి రొయ్యలు, ఇతర రకాల చేపలను ఆర్డర్పై తెప్పించుకుంటారు. జిల్లా కేంద్రంలో శనివారం ముందస్తుగానే మృగశిర చేపల విక్రయాలు జోరందుకున్నాయి. చాలా మంది కొనుగోలు చేస్తూ కనిపించారు.