ఇజ్రాయెల్ పార్లమెంటు (నాసాట్) పాలస్తీనా నేరస్థులను శిక్షించే కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ చట్టం కింద ఇజ్రాయెల్ పౌరుల హత్యలో లేదా ఉగ్రవాద కార్యకలాపాలలో పాలస్తీనియన్లు పాల్గొంటే వారికి నేరుగా ఉరిశిక్ష విధించబడుతుంది.
ఇజ్రాయెల్లోని కొన్ని గ్రూపులు చాలా కాలంగా ఈ బిల్లు కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఎట్టకేలకు పార్లమెంటులో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. దీనిప్రకారం పాలస్తీనాకు చెందిన వ్యక్తులు తీవ్రమైన నేరాలకు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం లేకుండా కూడా మరణశిక్షను ప్రకటించగలరు. అప్పీల్ చేసే హక్కు ఉండదు. శిక్ష విధించిన 90 రోజుల్లో ఉరితీయబడతాడు.
ఈ చట్టం జాతీయవాద లేదా తీవ్రవాద కారణాలకు వర్తిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మరణ శిక్షను జీవిత ఖైదు విధించే హక్కు కూడా కోర్టులకు ఉంటుంది.కాగా మానవ హక్కుల సంఘాలు ఈ బిల్లును జాతిపరంగా వివక్షతగా పేర్కొన్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ మానవ హక్కుల, పౌర సమాజ సంస్థలు ఈ చట్టం పాలస్తీనియన్లపై జాతి హింసను ప్రోత్సహిస్తున్నాయని నిరసన తెలుపుతూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కాగా ఇన్ని సంవత్సరాల ఇజ్రాయెల్ చరిత్రలో కేవలం రెండుసార్లు మాత్రమే ఆ ధేశంలోమరణశిక్ష విధించబడింది.


