భక్తి శ్రద్ధలతో షబ్బే బరాత్‌ | - | Sakshi
Sakshi News home page

భక్తి శ్రద్ధలతో షబ్బే బరాత్‌

Mar 9 2023 4:02 AM | Updated on Mar 9 2023 4:02 AM

- - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: ముస్లింలు మంగళవారం రాత్రి షబ్బే బరాత్‌ ( జగనేకీ రాత్‌ ) భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని అన్ని మసీదుల్లో సామూహికంగా ఇషా నమాజ్‌ నిర్వహించారు. అనంతరం ఖురాన్‌ పారాయణం చేసి ప్రవక్త ఔనత్యాన్ని కొనియాడుతూ సూక్తులు పఠించారు. పలు మసీదుల్లో బరాత్‌ విఽశిష్టతలను తెలుపుతూ.. మతగురువులు ప్రత్యేక ప్రసంగాలు చేశారు. చారిత్రక మక్కా మసీదులో బరాత్‌ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగరంలోని అన్ని మసీదుల్లో పలు ధార్మిక సంస్థలు బహిరంగ సభలు నిర్వహించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నదానం, పేదలకు దుస్తుల దానం చేశారు. షబ్బే బరాత్‌ రాత్రి చేసిన ఆరాధనలను అల్లా గుర్తిసాడని ముస్లింల నమ్మకం. రాత్రి నఫీల్‌ నమాజులు, దైవ ఆరాధనలో గడిపి ఫజర్‌ నమాజ్‌ అనంతరం శ్మశానాలకు వెళ్లి తమ పూర్వీకుల మోక్షానికి ప్రత్యేక దువాలు నిర్వహించారు. మసీదులు, శ్మశానాల్లో ఏర్పాట్లు షబ్బే బరత్‌ను పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ తరుఫున శ్మశానాల వద్ద లైట్లు ఏర్పాటు చేశారు. మసీదులు, శ్మశానాలను శుభ్రం చేశారు. శ్మశానాలకు వెళ్లే దారులకు మరమ్మతులు చేపట్టారు.

రాత్రి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు

తెల్లవారుజామున శ్మశానాల్లో దువా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement