వరంగల్‌ జిల్లాలో ‘మిషన్‌ తేజస్‌’ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ జిల్లాలో ‘మిషన్‌ తేజస్‌’

Aug 3 2025 2:51 AM | Updated on Aug 3 2025 2:51 AM

వరంగల్‌ జిల్లాలో ‘మిషన్‌ తేజస్‌’

వరంగల్‌ జిల్లాలో ‘మిషన్‌ తేజస్‌’

విద్యారణ్యపురి: సమగ్రశిక్ష తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ నవీన్‌నికోలస్‌ అనుమతితో వరంగల్‌ జిల్లాకు చెందిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థి గుండు అనిరుధ్‌ ఆధ్వర్యంలో మిషన్‌ తేజస్‌ (తెలంగాణ జ్ఞాన ఆవిష్కరణ సంకల్పం) నూతన ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించి ఆ స్కూళ్లను స్మార్ట్‌ ఇన్నోవేషన్‌గా మార్చేందుకు దోహదపడుతుంది. ప్రభుత్వానికి లేదా పాఠశాల విద్యాశాఖకు ఎలాంటి ఆర్థిక బాధ్యత ఉండొద్దనే నిబంధనతో ఈ కార్యక్రమానికి అనుమతినిస్తూ సమగ్రశిక్ష రాష్ట్ర డైరెక్టర్‌ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఆ ప్రాజెక్టు అడిషనల్‌ డైరెక్టర్‌ ఎం. రాధారెడ్డి ఈనెల 1న ప్రొసీడింగ్‌ జారీ చేశారు. ఈ మిషన్‌ ప్రారంభదశలో వరంగల్‌ జిల్లా విద్యాశాఖాధికారికి జిల్లాలోని 10 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి అమలు చేయాలని పేర్కొన్నారు. సంబంధిత ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు, ప్రతీ విద్యార్థి భద్రత,సైబర్‌ భద్రతాపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆమోదం లభించింది. శనివారం అనిరుధ్‌ తన తండ్రితో కలిసి వరంగల్‌ జిల్లా డీఈఓ మామిడాల జ్ఞానేశ్వర్‌ను కలిశారు. త్వరలోనే 10 ప్రభుత్వ పాఠశాలలను ఎంపికచేసే అవకాశం ఉంది.

మిషన్‌ రూపకర్త వరంగల్‌ కుర్రాడు

గుండు అనిరుధ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement