ప్రైవేట్‌లో అధిక ఫీజులను నియంత్రించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌లో అధిక ఫీజులను నియంత్రించాలి

Jun 14 2025 6:32 AM | Updated on Jun 14 2025 6:32 AM

ప్రైవ

ప్రైవేట్‌లో అధిక ఫీజులను నియంత్రించాలి

విద్యారణ్యపురి: ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల భారాన్ని నియంత్రించాలని విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో 25 శాతం పేదవర్గాల పిల్లలకు అడ్మిషన్లు కల్పించేలా చర్యలు చేపట్టాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్‌ డిమాండ్‌ చేశారు. హనుమకొండ డీఈఓ వాసంతి, వరంగల్‌ డీఈఓ జ్ఞానేశ్వర్‌కు శుక్రవారం వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దాసు సురేష్‌ మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు అడ్డూ.. అదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నాయని అన్నారు. నిబంధనలు పాటించని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ వంగ రవియాదవ్‌, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు హైమవతి, రవీందర్‌, అశోక్‌, కొడపాక దేవి, శ్రీరామోజు అంజలి, యోగేశ్వర్‌ పాల్గొన్నారు.

నూతన ఔషధ

ఆవిష్కరణలు అవసరం

కేయూ క్యాంపస్‌: మానవాళికి ఉపయోగపడే నూతన ఔషధాల ఆవిష్కరణలు చేయాలని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. యూనివర్సి టీలోని జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘హ్యాండ్స్‌ ఆన్‌ మాలిక్యూలర్‌ డాకింగ్‌ అండ్‌ డ్రగ్‌ డిస్కవరీ టెక్నిక్స్‌’ అనే అంశంపై మూడు రోజులపా టు జరిగే జాతీయ వర్క్‌షాప్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పరిశోధనారంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌తో నూతన ఔషధాలు ఆవిష్కరణలపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. మాలిక్యూలర్‌ డాకింగ్‌ మాన్యువల్‌ను వీసీ ఆవిష్కరించారు. వరంగల్‌ నిట్‌ బయో ఇన్ఫర్మెటిక్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పెరగు శ్యామ్‌, జువాలజీ విభాగం అధిపతి ఆచార్య షమిత, సైన్స్‌ డీన్‌ హనుమంతు, ప్రొఫెసర్లు ఇస్తారి, వెంకయ్య పాల్గొన్నారు.

వాహనం కొంటున్నానంటూ మోసం!

రామన్నపేట: వాహనం కొనుగోలు చేస్తున్నా ను.. మీ సాక్షి సంతకం కావాలని పలువురి నుంచి పాన్‌, ఆధార్‌ కార్డులు సేకరించి వారి పే రుపైన వాహనాలు కొనుగోలు చేసి విక్రయించిన ఓ వ్యక్తిని శుక్రవారం మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకా రం.. కొత్తవాడకు చెందిన బిట్ల సందీప్‌ దుస్తుల దుకాణం నిర్వహించి నష్టపోవడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని భావించాడు. ఈక్రమంలో తాను బైక్‌ కొనుగోలు చేస్తున్నానని.. సాక్షి సంతకం కోసం పాన్‌, ఆధార్‌ కార్డులు కావాలని ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద 10 మంది కార్డులు సేకరించి షో రూమ్‌ల నుంచి వివిధ ఫైనాన్స్‌ల వద్ద పది వాహనాలు కొనుగోలు చేశాడు. అనంతరం ఈ వాహనాలు దసరా ఆఫర్‌, దళిత బంద్‌కు చెందినవిగా చెప్పి పలువురికి విక్రయించాడు. ఈఎంఐలు చెల్లించకపోవడంతో పాన్‌కార్డు, ఆధార్‌కార్డులు ఇచ్చిన వారికి మెస్సెజ్‌లు రావడంతో విషయం బహిర్గతమైంది. విచారణ చేసిన శుక్రవారం నిందితున్ని అరెస్టు చేసి 10 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రైవేట్‌లో అధిక ఫీజులను నియంత్రించాలి
1
1/1

ప్రైవేట్‌లో అధిక ఫీజులను నియంత్రించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement