
కూటమి ప్రైవేటు ప్రేమ
ప్రభుత్వ విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోంది. సర్కారు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను చిన్నచూపు చూస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యకు పట్టం కడుతోంది. ఇటీవల అందజేసిన షైనింగ్ స్టార్ అవార్డులు దీనికి అద్దం పడుతున్నాయి. టెన్త్, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల నుంచి ప్రతిభావంతులుగా నిలిచిన విద్యార్థులను పక్కన పెట్టి కార్పొరేట్కు పెద్దపీట వేసింది.
గుంటూరు ఎడ్యుకేషన్: గత విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం షైనింగ్ స్టార్స్గా ఎంపిక చేసింది. ఈనెల 9న ఒక్కొక్కరికీ రూ.20వేలు చొప్పున నగదు అందజేసింది. గుంటూరు జిల్లాలో షైనింగ్ స్టార్స్ అవార్డులు అందుకున్న 150 మందిలో 116 మంది ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులే ఉండటం గమనార్హం. ప్రభుత్వ స్కూళ్లలో చదివిన పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కేవలం 34కు పరిమితమయ్యారు. అవార్డులు అందుకున్న 112 మంది టెన్త్ విద్యార్థుల్లో ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు 85 మంది ఉండగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 27 మందే ఉన్నారు. అదే విధంగా 38 మంది ఇంటర్ విద్యార్థుల్లో 31 మంది ప్రైవేటు, ఏడుగురు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం వారిపై సవతి తల్లి ప్రేమ చూపుతోంది. ప్రైవేటు, కార్పొరేట్ వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది.
జగనన్న పాలనలో ప్రభుత్వ విద్యార్థులకు పట్టం
జగనన్న పాలనలో ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యత లభించింది. విద్యార్థులను జగనన్న అణిముత్యాలు కార్యక్రమం ద్వారా సత్కరించి, నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ప్రతిభావంతులుగా నిలిచిన విద్యార్థులను నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో సత్కరించి, నగదు ప్రోత్సాహకాలను అందించే మహత్తర కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వారీగా టెన్త్లో అత్యధిక మార్కులు సాధించిన తొలి ముగ్గురు టాపర్లకు వరుసగా రూ.15వేలు, రూ.10వేలు, రూ.ఐదు వేలు చొప్పున నగదు ప్రోత్సహాలను అందజేశారు. నియోజకవర్గ స్థాయిలో 23 మంది టెన్త్ విద్యార్థులతో పాటు ఇంటర్మీడియెట్లో 15 మందితో పాటు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిధిలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాసిన తొలి ముగ్గురు విద్యార్థుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఎంపిక చేసి వారికి వరుసగా రూ.మూడువేలు, రూ.రెండువేలు, రూ.వెయ్యి చొప్పున అందించారు. జిల్లాస్థాయిలో టాపర్లుగా నిలిచిన 23 మంది విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలతో సన్మానించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.50వేలు, రూ.30వేలు, రూ.15వేలు చొప్పున మొత్తం రూ.8.20 లక్షలు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.
తల్లిదండ్రులే స్ఫూర్తి
స్వస్థలం గుంటూరు. నాన్న భానుప్రకాష్ గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలలో జువాలజీ అధ్యాపకునిగా పని చేస్తున్నారు. అమ్మ విజయ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణితశాస్త్ర అధ్యాపకురాలు. నీట్ ఓపెన్ కేటగిరీలో 262 ర్యాంకు వచ్చింది. తాజాగా ర్యాంకుతో ఎయిమ్స్లో సీటు సాధిస్తా.
– కారుమంచి విక్రాంత్,
9వ ర్యాంకు, ఎస్సీ కేటగిరీ
అమ్మానాన్నలు ప్రభుత్వ వైద్యులే
స్వస్థలం గుంటూరు. నాన్న డాక్టర్ గోవిందనాయక్, అమ్మ డాక్టర్ కరుణ జీజీహెచ్లో వైద్యులు. ఓపెన్ కేటగిరీలో 2,135వ ర్యాంకు సాధించా. కళాశాలలో అధ్యాపకులు అందించిన సహకారం, సందేహాల నివృత్తి, వీక్లీ టెస్టుల ద్వారా సబ్జెక్టు పరంగా పట్టు సాధించా. ఇది మెరుగైన ర్యాంకు సాధనకు దోహదపడింది. మంగళగిరి ఎయిమ్స్లో చేరతా.
– ఎం. అరవింద్, 13వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీ
షైనింగ్ స్టార్ అవార్డుల్లో ‘పచ్చ’పాతం ప్రభుత్వ విద్యార్థులను కాదని ప్రైవేటు, కార్పొరేట్కే పెద్దపీట వేసిన కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన 34 మంది విద్యార్థులకే పురస్కారాలు ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివిన 116 మందికి అధిక ప్రాధాన్యత గుంటూరు జిల్లాలో 150 మందికి రూ. 20వేలు చొప్పున నగదు అందజేత జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకే పట్టం

కూటమి ప్రైవేటు ప్రేమ

కూటమి ప్రైవేటు ప్రేమ

కూటమి ప్రైవేటు ప్రేమ