సివిల్స్‌లో 146వ ర్యాంకు సాధించిన రుద్రవరానికి చెందిన పవన్‌ కల్యాణ్‌ | - | Sakshi
Sakshi News home page

సివిల్స్‌లో 146వ ర్యాంకు సాధించిన రుద్రవరానికి చెందిన పవన్‌ కల్యాణ్‌

Apr 23 2025 7:54 AM | Updated on Apr 23 2025 8:33 AM

సివిల్స్‌లో 146వ ర్యాంకు సాధించిన రుద్రవరానికి చెందిన ప

సివిల్స్‌లో 146వ ర్యాంకు సాధించిన రుద్రవరానికి చెందిన ప

అచ్చంపేట: పల్నాడు జిల్లా, అచ్చంపేట మండలం, రుద్రవరం గ్రామానికి చెందిన చల్లా పవన్‌ కల్యాణ్‌ ఆల్‌ ఇండియా స్థాయిలో 146వ ర్యాంకు సాధించాడు. ఈ ఘనతను సాధించిన పవన్‌ కల్యాణ్‌ను మండల ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు. ప్రాథమిక సహకార సంఘ మాజీ అధ్యక్షుడు చల్లా రమేష్‌, భువనేశ్వరిల కుమాడుడైన పవన్‌ కల్యాణ్‌ ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంచలంచెలుగా తన చదువుకు పదునుపెట్టాడు. చిన్నపటి నుంచి సివిల్స్‌ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్‌ కల్యాణ్‌ ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుంటూరులోని వెంకటేశ్వర బాలకుటీర్‌లో పూర్తిచేశాడు. పదిలో 10 జీపీఏతో ఉత్తీర్ణత సాధించాడు. గుంటూరు శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదివిన పవన్‌ 987 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. జేఈఈలో మంచి ర్యాంకు సాధించి ఎన్‌ఐఐటీ, తిరుచురాపల్లిలో సీటు సాధించాడు. బీటెక్‌ అయిపోగానే కొలిన్స్‌ ఎయిరో స్పేస్‌లో కాలేజ్‌ కాంపస్‌ ప్లేస్‌మెంట్‌ సాధించాడు. అయితే సివిల్స్‌ మీద ఉన్న మక్కువతో వచ్చిన అవకాశాన్ని వదులుకుని, ఢిల్లీ వెళ్లి స్వయం కృషితో పాతకాలం నాటి మెటీరియల్స్‌ మొత్తం సేకరించి తన మేథస్సుకు పదునుపెట్టి సివిల్స్‌లో ఆల్‌ ఇండియా 146వ ర్యాంక్‌ సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement