వైరుద్ధ్య భారతంలో జాతీయవాదమా? | Ambedkar Jayanti 2025 Special Story | Sakshi
Sakshi News home page

Ambedkar Jayanti 2025: వైరుద్ధ్య భారతంలో జాతీయవాదమా?

Apr 14 2025 2:30 PM | Updated on Apr 14 2025 2:59 PM

Ambedkar Jayanti 2025 Special Story

బాబా సాహెబ్‌ అంబే డ్కర్‌ ఒక సందర్భంలో గాంధీజీతో జరిపిన సంభా షణలో ‘నాకు మాతృ దేశం లేదు’ అంటారు.అందుకు గాంధీజీ ‘లేదు, మీకు మాతృ దేశం వుంది’ అని బదులిస్తే... ‘మమ్మల్ని కుక్కలు, పందు లకంటే హీనంగా చూసే దేశాన్ని చూసి ఏ అంట రానివాడైనా ఈ దేశం నాది అని ఎలా అనుకో గలడు?’ అని అంబేడ్కర్‌ పేర్కొనడం విశేషం.    

భారత్‌లో ఇటీవలి కాలంలో జాతీయవాదం లేదా దేశభక్తి అనే భావనలు తరచూ వివాదాస్పద చర్చలకు దారితీస్తున్న క్రమంలో అంబేడ్కర్‌ జాతీ యవాదంపై వెలిబుచ్చిన అభిప్రాయాలను చర్చించడం అవసరం.  ఒకవైపు బ్రిటీష్‌ వలసవాదం అంతమై దేశానికి పాలనాధికారాలు బదిలీ అవుతున్న సందర్భంలో ఆయన జాతీయవాదంపై వ్యక్తపరి చిన అభిప్రాయాలు ఎంతో కీలకమైనవి. బ్రిటిష్‌ పాలన అంతమొందడంతోనే ఇక్కడి సమస్యలన్నీ సద్దుమణిగిపోతాయని అంబేడ్కర్‌తో పాటు అణ గారిన కులాలు భావించకపోవడం గమనార్హం.

బ్రిటిష్‌ వారికంటే ఇక్కడ ప్రత్యక్షంగా తమపై కుల దాష్టీకాన్ని ప్రదర్శించే నల్ల దొరలే తమ ప్రధాన శత్రువులు అనే అవగాహన అణగారిన వర్గాల్లో  దేశ వ్యాప్తంగా పెంపొందింది. ఉత్తరాదిన పంజాబ్‌లో ‘ఆదిధర్మి’ ఉద్యమం, ఒరిస్సాలో ‘మహిమ ధర్మం’, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్‌ రాష్ట్రాలలో ‘ఆది హిందూ’, దక్షిణాదిలో ‘ఆది ద్రావిడ’, ‘ఆది ఆంధ్ర’, ‘ఆది కన్నడ’ వంటి ఉద్య మాలు దళితులు ఈ దేశ మూలవాసులనే ఆత్మ గౌరవ ప్రకటనలు వెలువడుతున్న కాలమది. ఆధి పత్య కులాలకు చెందిన కవి గరిమెళ్ళ సత్యన్నా రాయణ బ్రిటిష్‌ వలస పాలనను వ్యతిరేకిస్తూ ‘మాకొద్దీ తెల్ల దొరతనం’ అనే గేయాన్ని రాస్తే... కుసుమ ధర్మన్న అనే దళిత కవి ‘మాకొద్దీ నల్ల దొరతనం’ అనే గేయాన్ని రాసి స్వరాజ్యం, స్వతంత్రం అనే అంశాలలో దళితుల ఆకాంక్షలను వ్యక్తీక రించడం గమనార్హం. తమిళనాట పండిత అయోతీ దాస్, పెరియార్ల నాయకత్వంలో జరిగిన ఆది ద్రావిడ ఉద్యమం కూడా ఆధిపత్య కులాల జాతీ యోద్యమంలో భాగస్వామి కాకుండా తమదైన స్వతంత్ర ఆకాంక్షలను వ్యక్తపరచడం చూస్తాం.

ప్రాంతీయంగా వ్యక్తమవుతున్న అణగారిన కులాల స్వతంత్ర ఆకాంక్షలకు అంబేడ్కర్‌ జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తూ పెద్ద కాన్వాసు మీద తమ జాతీయవాదం ఏమిటో నిర్మొహ మాటంగా చెబుతూ బ్రాహ్మణ బనియాల జాతీయవాద లొసుగులను దుయ్యబట్టాడు. అనేక కులాలు, మతాలు, భాషలు, ప్రాంతీయ అస్తి త్వాలు, వాటిమధ్య వైరుద్ధ్యాలు గల భారతదేశం ఒక జాతిగా ఉండే అవకాశం లేదని చెబుతూ ఇక్కడ జాతీయతా భావన ఇంకా సాధించాల్సిన ఆదర్శమేనని పేర్కొన్నారు. ఈ ‘దేశభక్తులు’ ఎంత సేపటికీ తమకూ, తమ వర్గానికీ అధికారం దక్కా లని తాపత్రయ పడుతుంటారని అన్నారు. తన జాతీయవాదం అన్ని రకాల గుత్తాధిపత్యాలనూ తిరస్కరిస్తుందని అన్నాడు.

అంబేడ్కర్‌ జాతీయవాదంపై వెలిబుచ్చిన భావాలకు నేటికీ ప్రాసంగికత ఉంది. ఆయన ఒక సందర్భంలో తన కాలపు దేశ భక్తులను ఉద్దేశించి వీరికి తమ పూర్వీకులు అణగారిన ప్రజలపై సాగించిన దారుణాలపై ఎటువంటి ప్రాయశ్చిత్త ధోరణీ లేకపోగా రాబోయే కాలంలో తమ వారు గతంలో సాగించిన ధోరణినే తిరిగి ప్రదర్శించడానికి వెన కాడబోరు అని పేర్కొన్నారు. అది ఈనాటి దేశ భక్తుల విషయంలో అక్షర సత్యమని తెలు
స్తుంది. ఇప్పుడు అణ గారిన కులాలు, ఆది వాసులు, స్త్రీలు, మైనారిటీల పట్ల పెత్తందారీ కులాల వారు సాగించే హత్యలు, అత్యా చారాలు సమస్తమైన దౌర్జన్యాలకు వారు దేశభక్తినీ, దైవ భావ ననూ అడ్డు పెట్టుకోవడం కళ్ళారా చూస్తున్నాం. కుహనా జాతీయవాదుల రెండు నాల్కల ధోర ణిని ఆయన సరిగ్గానే అంచనా వేయడం గమ నార్హం. ఆయన చూపించిన వెలుగు దారిలో సమ కాలీన ప్రజా వ్యతిరేక శక్తుల ఆట కట్టించి సామా జిక, రాజకీయ వైరుద్ధ్యాలను పరిష్కరించుకోవడం మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి. 
 

ప్రొ. చల్లపల్లి స్వరూపరాణి 
వ్యాసకర్త ప్రముఖ దళిత కవి, రచయిత్రి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement