ఘనంగా యోగాంధ్ర | - | Sakshi
Sakshi News home page

ఘనంగా యోగాంధ్ర

Jun 22 2025 4:02 AM | Updated on Jun 22 2025 4:02 AM

ఘనంగా

ఘనంగా యోగాంధ్ర

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు ఘనంగా జరిగాయని కలెక్టర్‌ కే. వెట్రిసెల్వి తెలిపారు. శనివారం స్థానిక సీఆర్‌ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 5,617 ప్రాంతాలలో కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఏలూరు ఇండోర్‌ స్టేడియం, అల్లూరి సీతారామరాజు స్టేడియంలో నిర్వహించిన యోగా కార్యక్రమాలకు మంచి స్పందన లభించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగా కార్యక్రమాలు నిర్వహించామని, యోగాంధ్ర కార్యక్రమంలో 9.59 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్‌, మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి, డీఆర్‌ఓ విశ్వేశ్వర రావు, ఇడా చైర్మన్‌ వాణి శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా యోగాంధ్ర 1
1/1

ఘనంగా యోగాంధ్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement