
పారిశ్రామికవేత్తలుగా మహిళలను తీర్చిదిద్దాలి
గడువు దాటితే ముప్పే
గ్యాస్ సిలిండర్లకూ కాలపరిమితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గడువు తేదీ ముగిసిన సిలిండర్లు వినియోగిస్తే గ్యాస్ లీకయ్యే ప్రమాదం ఉందంటున్నారు. 8లో u
ఏలూరు(మెట్రో): రాష్ట్రంలో లక్షమంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి మెప్మా అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెప్మా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలో నివసించే నిరుపేద మహిళల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సి ఉందన్నారు. డ్వాక్రా సంఘాలకు స్వయం ఉపాధి రుణాలు అందించి, ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటుచేయాలని, ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడేలా కృషిచేయాలన్నారు.
కోకో కొనుగోలు ప్రక్రియ తనిఖీ
పెదవేగి: జిల్లాలో రైతులకు ఏ చిన్న సమస్య వచ్చినా జిల్లా యంత్రాంగం వెంటనే స్పందిస్తుందని కలెక్టరు రైతులకు భరోసానిచ్చారు. శనివారం పెదవేగి మండలం కొండలరావుపాలెంలో కోకో కొనుగోలు ప్రక్రియను తనిఖీ చేశారు. రైతులతో మమేకమై సమస్యలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టరు మాట్లాడుతూ కోకో రైతులకు కేజీకి అదనంగా రూ.50 సబ్సిడీగా అందజేస్తున్నామన్నారు. జిల్లాలో కోకో 1800 టన్నులు ఉండగా ఈరోజు వరకు 1250 టన్నులు కొనుగోలు చేశామని తెలిపారు. ఈ నెల 30 నాటికి మిగతా 550 టన్నులు కొనుగోలు చేస్తామని భరోసానిచ్చారు. ఇంతవరకు కొబ్బరి తోటలోనే కోకో సాగు ఉండేదని, ఇక నుంచి పామాయిల్ తోటలో కూడా కోకో పండించేలా ప్రమోట్ చేస్తున్నామన్నారు. చిన్న రైతులకు కోకో ఎండబెట్టుకోడానికి టార్పాలిన్లు, సిమెంటు ప్లాట్ఫాంలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.