
తీవ్ర అన్యాయం చేస్తున్నారు
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు గత ఆరేళ్లుగా తీవ్ర అన్యాయాన్ని గురయ్యారు. ఒక్కో ఇంజనీరింగ్ కార్మికుడు ఈ ఆరు సంవత్సరాల కాలంలో నాలుగు లక్షలకు పైగా నష్టపోయాడు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
– బి.సోమయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్
టెక్నికల్ జీతాలు ఇవ్వాలి
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు టెక్నికల్ జీతాలు ఇవ్వాలి. సంక్షేమ పథకాలు వర్తింపజేయడంతో పాటు పర్మినెంట్ చేయాలి, రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని గత కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్నా పాలకులు పట్టించుకోకపోవడం బాధాకరం. తక్షణం మున్సిపల్ ఇంజనీరింగ్ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి.
– కొత్తూరు లక్ష్మణరావు, వాటర్ వర్క్స్ విభాగం నాయకులు, జంగారెడ్డిగూడెం
దిగొచ్చేంత వరకు ఆందోళన
ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఆందోళన కొనసాగుతుంది. ఆంధ్ర ప్రదేశ్లో మాత్రమే నైపుణ్యం గల వారికి నైపుణ్యం లేని వారి కంటే తక్కువ జీతాలు ఉన్నాయి. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన ఉధృతం చేసి అత్యవసర సేవలను సైతం నిలిపివేస్తాం.
– జి.నాగరాజు, వాటర్ వర్క్స్
విభాగం నాయకుడు, చింతలపూడి
ఒప్పందాలు అమలు చేయాలి
2023లో చేసిన 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలను తక్షణం అమలు చేయాలి. ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత తొమ్మిది రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి.
కానూరు సత్యనారాయణ,
వాటర్ వర్క్స్ విభాగం నేత, ఏలూరు
●

తీవ్ర అన్యాయం చేస్తున్నారు

తీవ్ర అన్యాయం చేస్తున్నారు

తీవ్ర అన్యాయం చేస్తున్నారు