రాష్ట్ర బెస్ట్ ఉర్ధూ టీచర్గా షేక్ సుభాని
మామిడికుదురు: స్థానిక జెడ్పీహెచ్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్న కాకినాడకు చెందిన షేక్ సుభానిని రాష్ట్ర బెస్ట్ ఉర్ధూ టీచర్గా ఎంపిక చేశారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ఉర్ధూ అకాడమీ సుభానిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. మంగళవారం విజయవాడలో జరిగే సమావేశంలో ఈ అవార్డును అందజేస్తారని స్కూల్ హెచ్ఎం బి.చిరంజీవిరావు సోమవారం తెలిపారు. రాష్ట్ర బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికై న షేక్ సుభానిని స్కూల్ ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు.


