కాండ్రేగుల పాఠశాలలో అదనపు జిల్లా జడ్జి విచారణ | - | Sakshi
Sakshi News home page

కాండ్రేగుల పాఠశాలలో అదనపు జిల్లా జడ్జి విచారణ

Jul 31 2025 8:36 AM | Updated on Jul 31 2025 8:36 AM

కాండ్రేగుల పాఠశాలలో  అదనపు జిల్లా జడ్జి విచారణ

కాండ్రేగుల పాఠశాలలో అదనపు జిల్లా జడ్జి విచారణ

జగ్గంపేట: మండలంలోని కాండ్రేగుల గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం 7వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి జి.చంద్రమౌళీశ్వరి విచారణ నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన పాఠశాలలో ఏడు గురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడం, వారికి ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆసుపత్రులలో చికిత్స అందించిన సంగతి తెలిసిందే. దీనిపై జిల్లా జడ్జి విచారణకు వచ్చి అస్వస్థతకు గురయినవిద్యార్థినులతోను, వైద్యం అందించిన డాక్టర్లతోనూ, విద్యార్థినులు తల్లిదండ్రు లతో ఆరోజు జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. విద్యార్థినులకు కౌన్సెలింగ్‌ సెషన్‌ నిర్వహించాలని ఆమె మండల విద్యాశాఖాధికారికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement