
23న ఒలింపిక్ డే రన్
అమలాపురం టౌన్: జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ ఉదయం జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో ఒలింపిక్ డే రన్లు నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఒలింపిక్ రన్ బ్రోచర్లు, సర్టిఫికెట్లను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఒలింపిక్ సంఘం ప్రతినిధులు స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. 23వ తేదీ ఉదయం 9 గంటలకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఈ రన్లలో వ్యాయామ ఉపాధ్యాయులు, స్పోర్ట్స్ క్లబ్ల ప్రతినిధులు, ఎంఎస్డీవోలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొంటా రని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడ శరత్బాబు తెలిపారు. పట్టణంలోని దుడ్డివారి అగ్రహారంలోని ఆఫీసర్ రిక్రియేషన్ క్లబ్ నుంచి కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ రన్ను ప్రారంభిస్తారని చెప్పారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు శరత్బాబు పర్యవేక్షణలో సంఘం ప్రతినిధులు కల్వకొలను బాబు, తిక్కిరెడ్డి సురేష్ల సహకారంతో ఈ రన్ సాగనుంది.
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్ ప్రవేశాలకు త్వరలో షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఈఏపీ సెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అడ్మిషన్లకు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్ కళాశాలలు సీట్లు భర్తీ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. సమయం దగ్గర పడటంతో కళాశాలల యాజమాన్యాలు మరింత స్పీడ్ పెంచాయి. తమ కళాశాలల్లో చేరండంటూ విద్యార్థులకు ఫోన్లు చేస్తున్నారు. కొంచెం పేరున్న కళాశాలల్లో చాలా వరకూ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ బ్రాంచ్లలో సీట్లు లేవని తెలుస్తోంది. సీట్లు పొందడానికి సిఫారసులు సైతం చేసుకునే పనిలో విద్యార్థులు ఉన్నారు. మొత్తం మీద ఇంజినీరింగ్ ప్రవేశాలకు అప్పుడే విద్యార్థులు ఎగబడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో రెండు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో 950 సీట్లతో పాటు 26 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో దాదాపు 14,500 సీట్లు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన ఎంసెట్–2025 ఫలితాల్లో కాకినాడ జిల్లాలో 6,343, కోనసీమ జిల్లాలో 2,866, తూర్పుగోదావరి జిల్లాలో 6,011 మంది ఉత్తీర్ణత సాధించారు. దీన్ని బట్టి కౌన్సెలింగ్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి అడ్మిషన్ లభిస్తుంది.
సీట్లు దొరకవనే ప్రచారం
ఎంసెట్ ఫలితాల్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకుందామని వేచి చూస్తే కోరుకున్న కళాశాలలో సీటు దొరక్కపోవచ్చనే ప్రచారం అప్పుడే జరుగుతోంది. సీటు విషయమై ఒక అంచనాకు వస్తే బాగుంటుందని, ముందస్తుగా కొంత అడ్వాన్స్ ముట్టజెప్పాలని ఆయా కళాశాలలు కోరుతున్నాయి. మంచి కళాశాలలో సీట్లు దొరకవనే ప్రచారంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ర్యాంకులతో సంబంధం లేకుండా సీట్లు ఖరారు చేసుకుంటున్నారు. కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్నారై ఇలా పలు విధాలుగా సీట్లు భర్తీ చేసుకుంటున్నారు. ఐదేళ్లుగా అంతర్జాతీయంగా ఐటీకి డిమాండ్ రావడం, సాఫ్ట్వేర్ కంపెనీలు భారీగా కొలువులను ఆఫర్ చేస్తుండడంతో చాలా వరకూ సీఎస్ఈ, దానికి అనుబంధంగా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర బ్రాంచ్లకు డిమాండ్ ఏర్పడింది. కాకినాడ జిల్లాలో బాగా పేరొందిన ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ సీటుకు డొనేషన్ రూ.10 లక్షల వరకూ ఇవ్వడానికి వెనకాడటం లేదంటే ఎంత డిమాండ్ ఉందో అర్థమౌతుంది. ఓ మోస్తరు కళాశాల అయితే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఇస్తామని, సీటు రిజర్వ్ చేయాలని కోరుతున్నారు. కౌన్సెలింగ్ ప్రారంభమై కోరుకున్న కళాశాలలో సీటు రాకపోతే.. అప్పుడు బాధపడినా ప్రయోజనం ఉండదని, ముందుగా యాజమాన్యాలతో మాట్లాడి ర్యాంకు వస్తే ఆ కోటాలో సీటు ఖరారు చేసుకోవచ్చని, లేకపోతే దాన్ని మేనేజ్మెంట్ కోటా లేదా ఎన్నారై కోటాకు మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి యాజమాన్యాలు ప్రస్తుతం సీట్లు భర్తీ చేసుకుంటున్నాయి.
కన్వీనర్ కోటాకే ప్రభుత్వ సహాయం
కన్వీనర్ కోటాలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తిస్తాయి. బీటెక్లో అన్ని బ్రాంచ్లు ముఖ్యమైనవే. విద్యార్థుల ఇష్టం మేరకూ కోర్సు ఎంచుకుని కన్వీనర్ కోటాలో చేరవచ్చు. జేఎన్టీయూకే పరిధిలో 160 కళాశాలల్లో దాదాపు 25 నుంచి 30వేల సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. ఎంసెట్ ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి కౌన్సెలింగ్లో పాల్గొనాలి.
– డాక్టర్ వీవీ సుబ్బారావు, ఏపీ ఎంసెట్ కన్వీనర్
బీటెక్ సీట్లకు బేరసారాలు
కౌన్సెలింగ్కు ముందే భర్తీకి చర్యలు
కంప్యూటర్ సైన్స్కు
విపరీతమైన డిమాండ్
కన్వీనర్ కోటా మేలంటున్న
విద్యానిపుణులు

23న ఒలింపిక్ డే రన్

23న ఒలింపిక్ డే రన్