
‘దీవెన’ బకాయిలు విడుదల చేయండి
అమలాపురం రూరల్: ప్రైవేటు కళాశాల విద్యార్థులకు బకాయి పడిన వసతి దీవెన, విద్యా దీవెన బకాయిలను చెల్లించి ఆదుకోవాలని జిల్లా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ ఆర్.మహేష్కుమార్, జేసీ నిశాంతిలకు వారు వినతి పత్రాలు అందజేశారు. 2023–24, 2024–25 విద్యా సంవత్సరాలకు సంబంధించి సంబంధించి మూడేసి టెర్మ్ల ఫీజులను ఇంతవరకు కళాశాలలకు జమ చేయలేదన్నారు. దీని వల్ల విద్యా సంస్థల మనుగడ కష్టంగా మారిందని వారు అవేదన వ్యక్తం చేశారు. కళాశాలల గుర్తింపు రెన్యువల్ విధానాన్ని ఐదేళ్లకు ఓసారి పెట్టాలని, సీట్ల భర్తీ విషయంలో మేనేజ్ మెంట్ కోటా తొలగించి కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదికవి నన్నయ్య యూనివర్సిటీ కళాశాల అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కరాటం వీఆర్ఎన్ నరసింహారావు, ఉపాధ్యక్షుడు ఆకుల బాపన్న నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కొవ్వూరు మున్సిపల్
కమిషనర్పై బదిలీ వేటు
కొవ్వూరు: స్థానిక మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న టి నాగేంద్ర కుమార్ను బదిలీ చేస్తూ బుధవారం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఈ బదిలీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. గతంలో కమిషనర్పై ఓ మహిళ విషయంలో పలు ఆరోపణలు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కలెక్టర్కు బాధితులు చేసిన ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్టు తెలిసింది.