
కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదు
పి.గన్నవరం: వైఎస్సార్ సీపీ కార్యకర్తలను, నాయకులను వేధిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, తాము తిరగబడితే తట్టుకోలేరని పీఏసీ సభ్యురాలు, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోతవరం గ్రామంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ పార్టీ నూతన కార్యాలయ ముఖ ద్వారాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కార్యాలయ గదిని విజయలక్ష్మి, సమావేశ మందిరాన్ని ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు బుధవారం ప్రారంభించారు. పార్టీ పతాకాన్ని జగ్గిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గన్నవరపు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై నిత్యం వేధింపులు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్రెడ్డిని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. 300 యూనిట్ల విద్యుత్ పేరుతో తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టారని విజయలక్ష్మి, జగ్గిరెడ్డి అన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం: తోట
ప్రజలకు, వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. కూటమి ప్రభుత్వ బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదన్నారు. రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తామని అన్నారు. మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. సంక్షేమ పథకాల అమలులో విఫలమైందన్నారు. చంద్రబాబు నాయుడు ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని అన్నారు. రాష్ట్ర ప్రజలకు జగన్పై అభిమానం తగ్గలేదన్నారు. నాయకులను జైలులో పెట్టగలరేమోగానీ ప్రజల గొంతు నొక్కలేరని అన్నారు. కోవిడ్లో రాష్ట ప్రజలకు జగన్ అందించిన సేవలను దేశమంతా ప్రశంసిందని తోట గుర్తు చేశారు. జగన్కు లభిస్తున్న ప్రజాభిమానికి భయపడిన కూటమి ప్రభుత్వం ఆయన పర్యటనలకు అడ్డంకులు కల్పిస్తోందని అన్నారు.
జగన్ను అధికారంలోకి తీసుకురావాలి:
ఎమ్మెల్సీలు బొమ్మి, కుడుపూడి
వచ్చే ఎన్నికల్లో జగన్ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. రెడ్బుక్ రాజ్యాగంతో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనిని అక్రమంగా అరెస్టు చేస్తే.. కూటమి ప్రభుత్వానికి కోర్టులు అక్షింతలు వేశాయన్నారు.
దేశంలో కులగణన జరగాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు అన్నారు. బీసీ కులగణనపై మండల స్థాయిలో వినతి పత్రాలు సమర్పించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని కుడుపూడి వైఎస్సార్ సీపీ శ్రేణులకు సూచించారు. పార్టీ కార్యాలయానికి షెడ్డు నిర్మించి ఇచ్చిన పార్టీ నాయకుడు యన్నాబత్తుల అనంద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నాయకులు ఆయనను సత్కరించారు.
రామచంద్రపురం, అమలాపురం కోఆర్డినేటర్లు పిల్లి సూర్యప్రకాష్, పినిపే శ్రీకాంత్, పార్టీ సీనియర్ నాయకుడు పి.కె.రావు, మండల పార్టీ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర రావు, కుడుపూడి విద్యాసాగర్, విత్తనాల ఇంద్రశేఖర్, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీలు కశిరెడ్డి అంజిబాబు, బూడిద వరలక్ష్మి, గూడపాటి రమాదేవి, మట్టా శైలజ, రాష్ట్ర నాయకులు చెల్లుబోయిన శ్రీకాంత్, మందపాటి కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్ సీపీ
పీఏసీ సభ్యురాలు విజయలక్ష్మి,
జిల్లా అధ్యక్షుడు జగ్డిరెడ్డి హెచ్చరిక
నియోజకవర్గ పార్టీ కార్యాలయం ప్రారంభం