యూత్‌ పార్లమెంట్‌కు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

యూత్‌ పార్లమెంట్‌కు ఎంపిక

Mar 26 2025 12:05 AM | Updated on Mar 26 2025 12:05 AM

యూత్‌ పార్లమెంట్‌కు ఎంపిక

యూత్‌ పార్లమెంట్‌కు ఎంపిక

ఏలేశ్వరం: రాష్ట్ర స్థాయి వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌–2025కు ఏలేశ్వరానికి చెందిన సాయిప్రదీప్‌ ఎంపికయ్యాడు. ఏపీ అసెంబ్లీలో జరిగే యూత్‌ పార్లమెంట్‌కు శ్రీకాకుళం జిల్లా నుంచి అతడు ప్రాతినిధ్యం వహిస్తాడు. కోస్తాంధ్ర నుంచి పలువురు విద్యార్థులు ఒక నిమిషం వీడియోను మై భారత్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. దీని ఆధారంగా విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో ఈ నెల 24న యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన ఎంపిక ప్రక్రియ జరిగింది. వీరిలో సాయిప్రదీప్‌ను టాప్‌–10లో ఒకరిగా ఎంపిక చేశారు. భారత రాజ్యాంగ వ్యవస్థపై ఈ నెల 28న అసెంబ్లీలో స్పీకర్‌ ముందు సాయిప్రదీప్‌ ప్రసంగించనున్నాడు. అతడిని పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement