ఓటు వేయలేదని గునపాలతో దాడి చేశారు

TDP Leaders Attacks In Srikakulam District - Sakshi

ఓట్లు వేయలేదనే అక్కసుతో కర్రలు, గునపాలతో బీభత్సం

సాక్షి, శ్రీకాకుళం: పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని తెలుగుదేశం నేతలు రాష్ట్రవ్యాప్తంగా దాడులకు తెగబడుతున్నారు. టీడీపీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. జిల్లాలోని కింతలి పంచాయతీ ఖాజీపేటలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తమ మద్దతుదారులకు ఓట్లు వేయలేదని అక్కసుతో గత అర్ధరాత్రి యాదవ వీధిలో కర్రలు, గునపాలతో బీభత్సం సృష్టించారు. కొందరి ఇళ్లపై దాడులు చేసి కరెంటు మీటర్లు, ఇంటి తలుపులు, కిటికీలు, రెండు బైకులను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో నలుగురు గాయలపాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్‌సీపీ నేతలు తమ్మినేని చిరంజీవి నాగ్‌, పప్పల వెంకటరమణ శనివారం పరామర్శించారు.


 

చదవండి: టీడీపీకి పరాభవం: నాటి పాపాలే.. నేటి శాపాలు!
పేదల గూటికి టీడీపీ గండి!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top