మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం.. ఏఎస్‌ఐకు 20 ఏళ్ల జైలుశిక్ష | Sakshi
Sakshi News home page

మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం.. ఏఎస్‌ఐకు 20 ఏళ్ల జైలుశిక్ష

Published Thu, Feb 3 2022 6:41 PM

Molestation on Insane Woman: 20 Years Imprisonment For ASI Mysore - Sakshi

మైసూరు: ఆపదలో ఉన్నవారిని రక్షించాల్సిన పోలీస్‌ అధికారి అయి ఉండి మతిస్థిమితం లేని యువతిని చెరబట్టిన కామాంధునికి కోర్టు కఠిన శిక్ష విధించింది. తుమకూరు నగరం అంతరసనహళ్లి వద్ద యువతిపై ఏఎస్‌ఐ ఉమేశయ్య అత్యాచారం చేసినట్లు నేరం రుజువు కావడంతో అతనికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను విధిస్తూ జిల్లా 2వ సెషన్స్‌ కోర్టు జడ్జి హెచ్‌.ఎస్‌.మల్లిఖార్జునస్వామి మంగళవారం తీర్పు వెలువరించారు.  

ఒంటరి యువతిని చూసి..  
2017న జనవరి 14వ తేదీన రాత్రి ఒంటరిగా ఉన్న మతిస్థిమితం లేని యువతిని ఉమేశయ్య గస్తీకి వెళ్లినప్పుడు చూశాడు. కొంతసేపటికి కారులో వచ్చి యువతిని బెదిరించి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటిరోజు ఈ దారుణం తెలిసి యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉమేశయ్యను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఉమేశయ్య నేరం చేసినట్లు కోర్టులో రుజువు కావడంతో శిక్ష తప్పలేదు. ప్రభుత్వ న్యాయవాది కవిత పకడ్బందీగా వాదనలు వినిపించారు. రూ. లక్ష జరిమానాను బాధితురాలికి అందజేయాలని దోషిని ఆదేశించారు. కాగా ఉమేశయ్య జీపు డ్రైవర్‌పై నేరం నిరూపణ కాకపోవడంతో అతనికి విముక్తి కల్పించారు. ఈ తీర్పుపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కామాంధులకు గుణపాఠం కావాలని పేర్కొన్నాయి.  

దోషి ఉమేశయ్య   

Advertisement

తప్పక చదవండి

Advertisement