నేరేడుచర్ల: పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని వదినను మరిది, అతని కుమారుడు కలసి సుత్తితో మోది చంపారు. ఆ తరువాత మృతదేహాన్ని ట్రాక్టర్లో తీసుకెళ్లి పొలం వద్ద కాల్చేశారు. శనివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. నేరేడుచర్ల ఎస్ఐ యాదవేందర్రెడ్డి కథనం ప్రకారం.. రామాపురానికి చెందిన రేఖ బాయమ్మ (51), పిచ్చయ్య.. భార్యాభర్తలు. 2004లో పిచ్చయ్య హత్యకు గురయ్యాడు. ఈ కేసులో బాయమ్మతోపాటు ఆమె మరిది సైదులు, మరో ఇద్దరు నిందితులుగా ఉన్నారు.
ఈ కేసులో వీరు జైలు జీవితం అనుభవించారు. అప్పటి నుంచి, ఆ హత్యతో తమకు సంబంధం లేకున్నా.. కేసులో ఇరికించారని సైదులు, అతని కుమారుడు ఉపేందర్ బాయమ్మపై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి నిద్రలో ఉన్న బాయమ్మ తలపై సుత్తితో కొట్టారు. రక్తపు మడుగులో ఉన్న ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ట్రాక్టర్లో బట్టువాని కుంట సమీపం లోని తమ పొలం వద్దకు తీసుకెళ్లి కాల్చివేశారు. ఆదివారం ఉదయం సైదులుతోపాటు అతని కుమారుడు ఉపేందర్ పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు.
ఆస్తిని కాజేసేందుకే..: సైదులు తమ పొలంలో పంట పండించుకొని కౌలు కూడా ఇవ్వడం లేదని, ఆస్తిని కాజేసేందుకే తన తల్లిని దారుణంగా హత్య చేశారని బాయమ్మ కూతురు కవిత నేరేడుచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా కౌలు విషయంలో ఘర్షణ జరుగుతుండటంతో తన తల్లి భయంతో రాత్రి పూట ఇతరుల ఇళ్లలో పడుకుంటోందని, తమ తల్లిని నమ్మించి అతి కిరాతకంగా హత్య చేశారని ఆరోపించింది. సైదులు, ఉపేందర్తో పాటు సైదులు భార్య ఎల్లమ్మ, చిన్న కుమారుడు హేమంత్పై కూడా తనకు అనుమానం ఉందని పేర్కొంది.
ఇదిలా ఉండగా బాయమ్మ చిన్న కుమార్తె శైలజను ఆమె భర్త మూడేళ్ల క్రితం హత్య చేశాడు. 2004లో బాయమ్మ భర్త హత్యకు గురయ్యాడు. ఇప్పుడు బాయమ్మను హత్య చేశారు. కాగా, ప్రస్తుత హత్యకు పాత కక్షలే కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
సుత్తితో మోది..పొలంలో కాల్చేసి..
Published Mon, May 24 2021 3:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పుతిన్ ఐదోసారి ప్రమాణం
బంగ్లాదేశ్దే టి20 సిరీస్
శిక్షణలోనే సందేహాలు నివృత్తి చేసుకోవాలి
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
ఎస్సీ వర్గీకరణ మోదీకే సాధ్యం
మీ బిడ్డను ఎంపీగా ఆదరించండి
అభివృద్ధిని అడ్డుకునే బీజేపీని ఓడించండి
ఇంటర్ ఫెయిల్ అయ్యామని..
‘దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీ’
వాహన తనిఖీలు ముమ్మరం
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement