ఆన్‌లైన్‌ గేమ్‌.. మరో యువకుడు బలి | Man commits suicide after losing money in Online Betting Hyderabad | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ గేమ్‌.. అప్పులు తీర్చలేక యువకుడు బలి

Nov 27 2020 12:44 PM | Updated on Nov 27 2020 3:24 PM

Man commits suicide after losing money in Online Betting Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ గేమ్‌కు మరో యువకుడు బలి అయ్యాడు. ఎల్బీనగర్‌కు చెందిన జగదీశ్‌ ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడి లక్షలాది రూపాయలు నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక బలవంతంగా శుక్రవారం తనువు చలించాడు. కాగా.. కొద్ది రోజుల క్రితమే జగదీశ్‌ చేసిన రూ.16 లక్షల అప్పును తండ్రి తీర్చాడు. అయినా అప్పులు మొత్తం తీరకపోవడంతో మళ్లీ ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడాడు. దీంతో జగదీశ్‌ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయి.. ఏమీ చేయలేని పరిస్థితుల్లో సెల్ఫీ తీసుకొని సూసైడ్‌కు పాల్పడ్డాడు. ఈ వీడియోలో తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    చదవండి: (కన్నీరు పెట్టించిన దారుణం.. నేటికి ఏడాది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement