ఆన్లైన్ గేమ్.. అప్పులు తీర్చలేక యువకుడు బలి

సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ గేమ్కు మరో యువకుడు బలి అయ్యాడు. ఎల్బీనగర్కు చెందిన జగదీశ్ ఆన్లైన్ గేమ్ ఆడి లక్షలాది రూపాయలు నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక బలవంతంగా శుక్రవారం తనువు చలించాడు. కాగా.. కొద్ది రోజుల క్రితమే జగదీశ్ చేసిన రూ.16 లక్షల అప్పును తండ్రి తీర్చాడు. అయినా అప్పులు మొత్తం తీరకపోవడంతో మళ్లీ ఆన్లైన్ గేమ్ ఆడాడు. దీంతో జగదీశ్ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయి.. ఏమీ చేయలేని పరిస్థితుల్లో సెల్ఫీ తీసుకొని సూసైడ్కు పాల్పడ్డాడు. ఈ వీడియోలో తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (కన్నీరు పెట్టించిన దారుణం.. నేటికి ఏడాది)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి