అక్రమ కేసులకు భయ పడొద్దు | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులకు భయ పడొద్దు

Jan 7 2026 7:35 AM | Updated on Jan 7 2026 7:35 AM

అక్రమ కేసులకు భయ పడొద్దు

అక్రమ కేసులకు భయ పడొద్దు

రొంపిచెర్ల : అక్రమ కేసులకు వైఎస్సార్‌సీపీ కార్యకర్త లు ఎవ్వరూ భయపడొద్దని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం రొంపిచెర్ల మండలం, చిచ్చిలివారిపల్లె గ్రామ పంచాయతీ, గురికివారిపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు బాలాజీని ఆయన కలిసి పరామర్శించారు. 25 రోజుల క్రితం తన వ్యవసాయ పొలంలో ఉన్న శ్రీగంధం మొక్కలను చదును చేసుకు నే క్రమంలో తొలగించానని, టీడీపీ నాయకులు ఫిర్యా దు చేయడంతో అటవీశాఖ అధికారులు అక్రమంగా కేసు నమోదు చేశారని బాలాజీ మాజీ మంత్రికి వివరించారు. దీనిపై పెద్దిరెడ్డి మాట్లాడుతూ అక్రమ కేసులకు ఎవ్వరూ భయపడొద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అధికారులు చంద్రబాబు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారి పేర్లను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలన్నారు. రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని, తర్వాత అసలు, వడ్డీ తిరిగి ఇచ్చేదామన్నారు. పెద్దిరెడ్డిని కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రతాప్‌రెడ్డి, ఆనందనాయుడు, పరమేశ్వర, రామనారాయణరెడ్డి, అనిల్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement