
వినియోగదారులకు మెరుగైన సేవలు
చిత్తూరు కార్పొరేషన్: వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా సిబ్బంది, అధికారు లు పనిచేయాలని ట్రాన్స్కో టెక్నికల్ డైరెక్టర్ గురవ య్య తెలిపారు. ఆయన ఆదివారం ఎస్ఈ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 60 శాతం మంది వినియోగదారులు సంతృప్తి స్థాయిలో ఉన్నట్టు తెలిపారు. సిబ్బంది, అధికారులు సకాలంలో వినియోగదారులకు ఫోన్ల లో సమాధానం ఇవ్వడంతోపాటు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే 90 శాతానికి పైగా సంతృప్తి చెందుతారని వెల్లడించారు. అధికారులు తప్పనిసరిగా మండల, జిల్లా కేంద్రాల్లో అందు బాటులో ఉండాలన్నారు. కొంతమంది నిర్లక్ష్యంగా వ్య వహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ట్రాన్స్ఫార్మర్ల సమస్యలతో అల్లాడుతున్నట్టు తెలిపా రు. స్టోర్స్లో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు, అనుబంధ సామగ్రి ఉన్నా రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్ర శ్నించారు. అందటం లేదన్నారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులకు రైతులు ట్రాక్టర్లు పెట్టుకొని ఎస్పీఎంకు రా వడం ఆగలేదన్నారు. ఎన్ని రోజులు వర్క్ ఆర్డర్లు పెండింగ్లో ఉన్నట్టు నోటీసులు అందుకుంటారని, వాటి ని క్లోజ్ చేయడానికి ఇంకా ఎంత సమయం కావాలని మండిపడ్డారు. ఎంతో ఉపయోగమైన ఆర్డీఎస్ఎస్ పనుల ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీఎంలో నూతన ఓఆర్ఎం మెషిన్ ఇన్స్టలేషన్ కోసం చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్, ఈఈ సురేష్, జగదీష్, అమర్బాబు, పీవో రెడ్డెప్ప, ఏవో ప్రసన్న, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.