వరసిద్ధుని సేవలో పలువురు ప్రముఖులు | - | Sakshi
Sakshi News home page

వరసిద్ధుని సేవలో పలువురు ప్రముఖులు

Jun 15 2025 8:23 AM | Updated on Jun 15 2025 8:23 AM

వరసిద

వరసిద్ధుని సేవలో పలువురు ప్రముఖులు

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర వెల్ఫేర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాజశేఖర్‌, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీ.ఆర్‌ మధుసూదన్‌రావు, రాష్ట్ర సీబీఐ డీఐజీ మురళిరంభ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వేద ఆశీర్వచన మండపంలో పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేయగా ఈవో పెంచలకిషోర్‌ వారికి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.

వెండి దీపం.. నైవేద్య పాత్రల వితరణ

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి శనివారం ఓ దాత కుటుంబీకులు వెండి పాత్రలు విరాళంగా అందజేశారు. తిరుపతికి చెందిన చంద్రశేఖర్‌ కుటుంబీకులు రూ.3.80 లక్షల విలువ చేసే 3.5 కిలోల వెండి దీపం, నైవేద్య పాత్రలు విరాళంగా ఈవో పెంచల కిషోర్‌కు అందజేశారు. అనంతరం వారికి దర్శన భాగ్యం కల్పించారు.

మెకానిక్‌ ఆత్మహత్యాయత్నం

చౌడేపల్లె: మండలంలోని గోసులకురప్పల్లె గ్రామానికి చెందిన రమణ కుమారుడు ప్రకాష్‌(36) మెకానిక్‌షాపు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రకాష్‌ పలువురి వద్ద అప్పులు చేశాడు. అప్పుల వారి వేధింపులు అధికం కావడంతో శనివారం పంట పొలాలకు ఉపయోగించే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. కుటుంబీకులు అతన్ని పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు.

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పుంగనూరు(చౌడేపల్లె) : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘట న పుంగనూరు మండలంలోని నల్లూరుపల్లె గ్రా మంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అగస్తీ కుమారుడు కుమార్‌(30) శనివా రం పురుగుల మందుతాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు 108 సహాయంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రేపటి నుంచి డిగ్రీ, పీజీ తరగతులు

తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలోని అన్ని డిగ్రీ, పీజీ కళాశాలలో సోమవారం నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. ఆయా కళాశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. కళాశాలలతో పాటు అదే రోజు వసతి గృహాలు సైతం తెరుచుకోనున్నట్లు అధికారులు తెలిపారు. పద్మావతి మహిళా వర్సిటీలో సైతం తరగతులు ప్రారంభం కానున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్పీడబ్లూ, ఎస్‌జీఎస్‌, ఎస్వీ ఆర్ట్స్‌, ఎస్వీ ఓరియంటల్‌ కళాశాలలు సోమవారం నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నాయి.

వరసిద్ధుని సేవలో పలువురు ప్రముఖులు 
1
1/4

వరసిద్ధుని సేవలో పలువురు ప్రముఖులు

వరసిద్ధుని సేవలో పలువురు ప్రముఖులు 
2
2/4

వరసిద్ధుని సేవలో పలువురు ప్రముఖులు

వరసిద్ధుని సేవలో పలువురు ప్రముఖులు 
3
3/4

వరసిద్ధుని సేవలో పలువురు ప్రముఖులు

వరసిద్ధుని సేవలో పలువురు ప్రముఖులు 
4
4/4

వరసిద్ధుని సేవలో పలువురు ప్రముఖులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement