
రోడ్డెక్కిన మామిడి రైతులు
గంగాధర నెల్లూరు: గిట్టుబాటు ధర కోసం మామిడి రైతులు రోడ్డెక్కారు. కర్మాగారాల యాజమాన్యాల తీరుపై శనివారం నిరసనకు దిగారు. చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిలోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ తీరుపై విరుచుకుపడ్డారు. తోతాపురి కిలో రూ.8కి కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించానా ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.6 కొనుగోలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టోకెన్ వ్యవస్థను రద్దుచేసి సీరియల్గా ముందు వచ్చే రైతుల మామిడి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సిఫారసుల టోకన్లే అధికంగా ఉన్నాయని మండిపడ్డారు. కాయ కుళ్లిపోక ముందే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల స్పందిస్తూ సోమవారం నుంచి సీరియల్గా ఎవరు ముందు వస్తే వారి పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

రోడ్డెక్కిన మామిడి రైతులు