సమర్థవంతంగా ఎన్నికల విధులు
చిత్తూరు కలెక్టరేట్ : సెక్టోరియల్ అధికారులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని, సమర్థవంతంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్ఓ రాజశేఖర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో సెక్టోరల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపు, వీల్ చైర్స్, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, వెబ్ క్యాస్టింగ్కు ఏర్పాట్లు చేసి నివేదిక సమర్పించాలన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులకు వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతం పంపించాలని స్పష్టం చేశారు.
ఎన్నికల హెల్ప్డెస్క్ పరిశీలన
ఎమ్మెల్సీ ఎన్నికలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ను డీఆర్ఓ రాజశేఖర్ శుక్రవారం పరిశీలించారు.