తెలంగాణలో పెట్టుబడుల హోరు | Telangana Rising Global Summit 2025, Trump Media Technology Group Announced A Massive 1 Lakh Cr Investment | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పెట్టుబడుల హోరు

Dec 8 2025 4:46 PM | Updated on Dec 8 2025 5:38 PM

Trump Media Technology Group announced a massive 1 lakh cr investment

ట్రంప్‌ మీడియా టెక్నాలజీ గ్రూప్‌ సీఈవో ఎరిక్‌ స్వీడర్‌ ఈ తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌కు హాజరై కీలక పెట్టుబడిని ప్రకటించారు. వచ్చే పదేళ్లలో తెలంగాణలో రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. అయితే, గతంలో హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్ ప్రాజెక్టును రూ.3,500 కోట్లతో నిర్మించనున్నట్లు (ట్రంప్ ఆర్గనైజేషన్-ట్రైబెకా డెవలపర్స్‌ భాగస్వామ్యంతో) వార్తలు వచ్చాయి. ట్రంప్ గ్రూప్ తరఫున లక్ష కోట్ల పెట్టుబడి ప్రకటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఇది ట్రంప్‌ ఫ్యామిలీ గ్రూప్‌ కావడం విశేషం.

తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు మార్గం సుగమమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌’ వేదికగా ఏకంగా రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు 14 ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఫ్యూచర్‌ సిటీలో ఈ సదస్సు 8, 9 తేదీల్లో జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయా కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.

భారీ పెట్టుబడుల్లో ముఖ్యాంశాలు:

టీసీఎస్‌ - టీపీజీ భాగస్వామ్యం: ఐటీ దిగ్గజం టీసీఎస్‌, మరో సంస్థ టీపీజీతో కలిసి రూ.70 వేల కోట్లు (8 బిలియన్‌ డాలర్లు)** పెట్టుబడితో అత్యాధునిక హైపర్‌వాల్ట్‌ డేటా సెంటర్లను స్థాపించనుంది. ఇది అతిపెద్ద వ్యక్తిగత పెట్టుబడుల్లో ఒకటిగా నిలిచింది.

రంగాలు: ఐటీ, పరిశ్రమలు, పర్యాటకం, క్రీడలు, వినోదం, ఉన్నత విద్య వంటి వివిధ రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి.

ఏఐ సిటీ ఏర్పాటు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి ప్రాధాన్యత ఇస్తూ ఫ్యూచర్‌ సిటీలో 100 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అజయ్ దేవ్‌గణ్‌ ప్రతిపాదన: అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిల్మ్‌సిటీ ఏర్పాటుకు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ ముందుకొచ్చారు.

ఇదీ చదవండి: ఎస్‌బీఐ ఉద్యోగులకు జాక్‌పాట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement